ఇంటి ఇంటి ప్రచారం నిర్వహించిన తాటి

Spread the love

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.

అశ్వారావుపేట

సాక్షిత న్యూస్…..

ఇంటి ఇంటి ప్రచారం నిర్వహించిన తాటి

 అశ్వారావుపేట మండలోని  కుడుములపాడు, నందిపాడు, ఒడ్డు రంగాపురం, గుమ్మడివల్లి ప్రాజెక్ట్, కొత్తూరు, బొచ్చువారిగూడెం, నమిలి పేట, గాండ్లగూడెం, అనంతరం గ్రామాల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించిన అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే టీపీసీసీ ప్రధాన కార్యదర్శి తాటి వెంకటేశ్వర్లు గారు   ప్రజలతో మమేకమై వారికి ప్రియతమ నేత రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారు, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క గారు 2023 లో  రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో సబ్బండ వర్గాలకు కలిగే మేలును ₹ (డిక్లరేషన్ )సంక్షేమ పథకాలను  ప్రజలకు వివరించారు.                                                            ఈ సందర్భంగా ప్రజలతో మాట్లాడుతూ 2023 లో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత   రైతన్నలకు ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ, భూమి లేని రైతు కూలీలకు సంవత్సరానికి 12 వేల ఆర్థిక సహాయం, ధరణి పోర్టల్ రద్దుచేసి పోడు భూములకు పట్టాల పంపిణీ, రైతు పండించిన పంటలకు గిట్టుబాటు ధర, 500 రూపాయలకే వంట గ్యాస్ సిలిండర్, మహిళలకు పావలా వడ్డీ రుణాలు,  చేయూత పథకం కింద వృద్ధులు వికలాంగులు ,వితంతువులు, ఒంటరి మహిళలు, గీత కార్మికులు చేనేత కార్మికులు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు, డయాలసిస్ రోగులకు నెలకు 4000 రూపాయల పెన్షన్,తెల్ల కార్డున్న ప్రతి కుటుంబానికి 5 లక్షల వరకు  అన్ని జబ్బులకు ఆరోగ్య శ్రీ పథకం కింద ఉచిత వైద్యం, ఇల్లు లేని ప్రతి కుటుంబానికి 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం & ఇందిరమ్మ ఇల్లుల మంజూరు, ప్రతి పేద కుటుంబానికి 9 రకాల నిత్యావసర సరుకుల (రేషన్) పంపిణీ   , నిరుద్యోగులకు నెలకు 4000 రూపాయల నిరుద్యోగ భృతి, ప్రభుత్వం ఏర్పడిన తొలి ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాల భర్తీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ ,మైనారిటీ, ఈడబ్ల్యూఎస్ విద్యార్థులందరికీ ఫీజు రియంబర్స్మెంట్, తెలంగాణ అమరవీరుల కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, నెలకు 25 వేల గౌరవ పెన్షన్, 18 సంవత్సరాలు పైబడి చదువుకునే ప్రతి యువతీకి ఎలక్ట్రిక్ స్కూటర్ అందజేత, కేజీ టు పీజీ ఉచిత విద్య , తదితర సంక్షేమ కార్యక్రమాలు కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతుందని వారు ప్రజలకు వివరించారు.                                                        ###తెలంగాణలో ప్రజా సంక్షేమo బాగుండి ,సమ సమాజ స్థాపన జరగాలంటే ఇందిరమ్మ రాజ్యం రావాలని ,కావున ప్రజలందరూ రానున్న 2023 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఆదరించాల్సిందిగా  ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జేష్ట సత్యనారాయణ చౌదరి గారు, దాసరి నాగేంద్రబాబు గారు, పొట్ట రాజులు గారు, ముస్తఫా డాక్టర్ గారు, భయ్యా సత్తిబాబు గారు, పుచ్చకాయల రమేష్ గారు, వగ్గేల హేమంత్ గారు, సింహాచలం గారు, నాగరాజు గారు, నల్లపు రామారావు గారు,  గారు, బయ్యా చిన్నా గారు, పుల్లయ్య గారు, కోడూరి శ్రీనివాసరావు గారు, రాంబాబు గారు, కొవ్వాసి దుర్గారావు గారు, కొనకల్ల లక్ష్మణరావు గారు, కోన సత్తిబాబు గారు, గడ్డి సతీష్ గారు, తమ్మిశెట్టి పోసి గారు, భూక్య రామారావు గారు, భూక్య ప్రసాద్ గారు, అనిల్ కృష్ణ గారు, మల్లేష్ గారు తదితర ముఖ్య నాయకులు యువకులు పాల్గొన్నారు....

Related Posts

You cannot copy content of this page