సాక్షిత హైదరాబాద్: సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం సూరంపల్లిలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై జరిగిన కత్తి దాడి ఘటనపై గవర్నర్ తమిళిసై స్పందించారు.
ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రభాకర్ రెడ్డి త్వరగా కొలుకోవాలన్నారు. ఘటనపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డీజీపీకి ఆదేశాలు జారీ చేశారు. ” ప్రజాస్వామ్యంలో హింసకు తావు లేదు. ఇలాంటి ఘటనలు ప్రజాస్వామ్య ప్రక్రియకే ప్రమాదకరం. ఎన్నికల సమయంలో పోటీలో ఉన్న అభ్యర్థులు, ప్రచారం చేసే వారి భద్రత కోసం తగిన చర్యలు తీసుకోవాలి. స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత ఎన్నికల కోసం శాంతియుత వాతావరణాన్ని ఉండేలా చూడటం చాలా అవసరం” అని గవర్నర్ పేర్కొన్నారు.
ప్రజాస్వామ్యంలో హింసకు తావు లేదు.. తమిళిసై
Related Posts
కమిషన్ లు లెంది బి.ఆర్.ఎస్ నాయకులు పని చేయరు
SAKSHITHA NEWS కమిషన్ లు లెంది బి.ఆర్.ఎస్ నాయకులు పని చేయరుసవాల్ ను స్వీకరిస్తూన్నాం …..చర్చకు రండి – మాజీ ఎంపీటీసీ తిరుపతి సాక్షిత ధర్మపురి ప్రతినిధి:-….కమిషన్ లు లేనిది బి.ఆర్.ఎస్ నాయకులు పని చేయరు అని జీవోను మీ ప్రభుత్వ…
ఓపెన్ స్కూల్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేయాలి.
SAKSHITHA NEWS ఓపెన్ స్కూల్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేయాలి.మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి అధికారుల సమీక్షకు నివేదికలు సిద్ధం చేయాలి. సాక్షిత సూర్యపేట జిల్లా ప్రతినిధి: ప్రజా సమస్యల పరిష్కారం కోసమే ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్…