ఆల్విన్ కాలనీలో ప్రచారం చేపట్టిన కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్

Spread the love

శేరిలింగంపల్లి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఆరేకపూడి గాంధీ ని వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో భారీ మెజారిటీతో గెలిపించుకోవడానికి 124 డివిజన్ తరపునుండి కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ పాదయాత్ర చేస్తూ ఇంటింటికి వెళ్లి ప్రచార కార్యక్రమం నిర్వహించడం జరిగింది. డివిజన్ పరిధిలోని ఆల్విన్ కాలనీ ఫేస్ 1, సాయి నగర్ ఈస్ట్, సాయి నగర్ వెస్ట్ మరియు ఆదిత్య నగర్ కాలనీలలో ఇంటింటికి వెళ్లి కాలనీ వాసులను ఆప్యాయంగా పలకరిస్తూ కారు గుర్తుకే ఓటు వేయాలని ప్రచారం చేయడం జరిగింది.

ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలో మరియు శేరిలింగంపల్లి నియోజకవర్గంలో అఖండ మెజార్టీతో గెలిచి బీఆర్ఎస్ పార్టీ మరోసారి అధికారంలోకి వస్తుందని అన్నారు. పాదయాత్ర చేస్తూ ఎక్కడికి వెళ్లినా ప్రజలు ఆప్యాయంగా స్వాగతం పలుకుతున్నారని సంతోషం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ అమలు చేసిన ఎన్నో సంక్షేమ పథకాలు మరియు అభివృద్ధి పనులను ప్రజలు మరిచిపోలేదని, ఎవరింటికి వెళ్లిన ఆసరా పెన్షన్, కల్యాణ లక్ష్మీ వంటి వాటి గురించే మాట్లాడుతున్నారని అన్నారు. తనతో పాటు ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న నాయకులకు, మహిళలకు పేరుపేరునా ధన్యవాదాలు తెలియచేసారు. మనందరం బీఆర్ఎస్ పార్టీ విజయం కోసం సమిష్టిగా పనిచేసి గాంధీ కి హ్యాట్రిక్ విజయాన్ని అందించాలని కోరారు.

కార్యక్రమంలో యువనేత దొడ్ల రామకృష్ణ గౌడ్, డివిజన్ ఆదయక్షులు సమ్మారెడ్డి, అధ్యక్షులు అనిల్ రెడ్డి, ఉపాధ్యక్షులు కాశినాథ్ యాదవ్, రాజేష్ చంద్ర, ప్రధానకార్యదర్శి గుడ్ల శ్రీనివాస్, శివరాజ్ గౌడ్, పాండుగౌడ్, బి.వెంకటేష్ గౌడ్, ప్రభాకర్, ప్రకాష్, గోపిచారి, శేఖర్, శ్రీధర్, సంతోష్ బిరాదర్, ఉమేష్, నిరంజన్, పరమేష్, జె.భాస్కర్, షౌకత్ అలీ మున్నా, యాదగిరి, రాములుగౌడ్, దేవేందర్, సాయిగౌడ్, రవీందర్, భిక్షపతి, కూర్మయ్య, వెంకటేష్, బాలరాజు, వై.శ్రీనివాస్, అర్వరవి, వెంకటకృష్ణ, మహిళా అధ్యక్షురాలు రాజ్యలక్ష్మి, మహిళా అధ్యక్షురాలు మధులత, శిరీష సత్తుర్, స్వరూపా, లావణ్య, లక్ష్మమ్మ, మంజుల, షేక్ బిబి, ఎ. స్వరూపా, పుట్టం దేవి, నస్రీన్, రేణుక, సురేఖ, ప్రీతి, స్వప్న, వరలక్ష్మి, బి.లక్ష్మీ, దేవి, వల్లి రమణ, సంతోషమ్మ, సౌందర్య, కృష్ణవేణి, పర్వీన్, యస్మిన్, మహముదా, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకురాళ్లు కాలనీ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Whatsapp Image 2023 10 30 At 3.57.46 Pm

sakshithanews

sakshithanews.com is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field

Related Posts

You cannot copy content of this page