స్వాతంత్ర వజ్రోత్సవ ద్వి సప్తాహ వేడుకల్లో భాగంగా సాముహిక జాతీయ గీతాలాపన కార్యక్రమం

Spread the love

స్వాతంత్ర వజ్రోత్సవ ద్వి సప్తాహ వేడుకల్లో భాగంగా సాముహిక జాతీయ గీతాలాపన కార్యక్రమం
సాక్షిత : సికింద్రాబాద్ లో సందడిగా జరిగింది. అడ్డగుట్ట లో స్థానిక కార్పొరేటర్ శ్రీమతి లింగాని ప్రసన్న లక్ష్మి శ్రీనివాస్ అద్వర్యంలో ఘనంగా జరిగిన కార్యక్రమంలో ఉప సభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. తొలుత ఉదయం పదిన్నర గంటల నుంచి తుకారాం గేటు నుంచి భారీ సంఖ్యలో కార్యకర్తలు, వివిధ స్కూల్ ల విద్యార్ధులు, స్థానికులు, పోలీసులతో పద్మారావు గౌడ్ తిరంగా ర్యాలీని  చేపట్టారు. అనంతరం అడ్డగుట్ట కూడలి వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదిక నుంచి సాముహిక జాతీయ గీతా లాపన కార్యక్రమంలో పద్మారావు గౌడ్ పాల్గొని అందరితో కలిసి జాతీయ గీతాన్ని తను కూడా ఆలపించారు. అడ్డగుట్ట ప్రాంతమంతా త్రివర్ణ పతకాల  రెపరెపలతో కళకళలాడింది.తి రంగా   ఫ్రెండ్స్ యూత్  అసోసిఏషన్ ఆద్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో తెరాస  యువ నేత రామేశ్వర్ గౌడ్, తుకారం గేటు ఇన్స్పెక్టర్ శ్రీ ఎల్లప్పు, జీ హెచ్ ఎం సీ ప్రాజెక్ట్ అధికారి శ్రీనాద్ తదితరులు పాల్గొన్నారు. అడ్డత్యు  అడ్డగుట్ట, తుకారం గేటు, మారేడుపల్లి, లోహియ నగర్, లాలాగూడ ప్రాంతాలకు చెందిన వివిధ స్కూల్ విద్యార్ధులు, ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page