SAKSHITHA NEWS

ప్రజల మధ్యలో ఉంటా
ప్రజా సంక్షేమమే ద్యేయంగా పనిచేస్తా: సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి


సాక్షిత : గత రెండు నెలల క్రితం వెల్డండ మండలంలోని నెమలి గుండు తండా గ్రామంలో ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ సుంకి రెడ్డి రాఘవేందర్ రెడ్డి పర్యటించి మంచినీటి ఆరో ప్లాంట్ నిర్మాణానికి హామీ ఇచ్చారు.

ఇచ్చిన హామీ మేరకు మాట తప్పకుండా శుద్ధమైన మంచినీటి ఆర్వో ప్లాంట్ ను ప్రజలందరి సమక్షంలో ప్రారంభించారు .
ప్రజలందరూ శుద్ధమైన మంచినీటిని త్రాగడం వల్ల ఆరోగ్యవంతంగా ఉంటారని తెలుపుతూ ,ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ఇచ్చిన ప్రతి హామీని తప్పకుండా నెరవేరుస్తానని తెలిపారు

ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ బుజ్జి దేశ్య నాయక్, మాజీ జడ్పీటీసీ వెంకట్ నాయక్, పుల్సింగ్, నారాయణ, రాం చందర్, గ్రామస్థులు,ఐక్యత ఫౌండేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS