భూగర్భడ్రైనేజీ అభివృద్ధికి కృషి చేయాలని ఎమ్మెల్యేను కలిసిన అసోసియేషన్ సభ్యులు

Spread the love

భూగర్భడ్రైనేజీ అభివృద్ధికి కృషి చేయాలని ఎమ్మెల్యేను కలిసిన అసోసియేషన్ సభ్యులు…
సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 18వ డివిజన్ కు చెందిన నందన వనం కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ని చింతల్ లోని తన కార్యాలయం వద్ద స్థానిక కార్పొరేటర్ కోలన్ వీరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తమ కాలనీలో నెలకొన్న భూగర్భడ్రైనేజీ సమస్యను ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా.. ఎమ్మెల్యే వెంటనే స్పందించి సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా తగు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కిషోర్, రాజీవ్, ప్రసాద్, రంగరాజు, ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page