SAKSHITHA NEWS

విద్యార్థులు సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి

విజయనగరం జిల్లా గుర్ల మండల కేంద్రంలోని గ్రంధాలయంలో పరిసర ప్రాంతాల విద్యార్థులకు ‘వేసవి విజ్ఞాన శిబిరాన్ని’ గ్రంధాలయ అధికారి పి.రామారావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవికాలంలో విద్యార్థులకు ఇచ్చిన సెలవుల్లో విద్యార్థులు మరింత జ్ఞానాన్ని పెంపొందించుకోవాలని ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం మే 8వ తేదీ నుండి జూన్11వరకు రాష్ట్రంలోని అన్ని గ్రంధాలయాల్లో వేసవి విజ్ఞాన శిబిరాలను ఏర్పాటు చేసారన్నారు..అనంతరం విద్యార్థులకు సైకాలజిస్ట్ బసుపోతన పలు అంశాలపై అవగాహన కల్పిస్తూ నేటి కాలంలో సామాజికంగా విలువలు తగ్గిపోతున్నాయని విద్యార్థులు నైతిక విలువలను పెంచుకోవాలన్నారు. సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.విద్యార్థులు చదువుతో పాటు వ్యాయామం చేయాలన్నారు.ఈ కార్యక్రమంలో
ఉపాధ్యాయులు చిన్నా దేవి ఉన్నారు.


SAKSHITHA NEWS