పటాన్చెరులో ఘనంగా శ్రీ రాములవారి కళ్యాణం..

Spread the love

పటాన్చెరులో ఘనంగా శ్రీ రాములవారి కళ్యాణం….
స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కుటుంబసభ్యులు …..
సతీ సమేతంగా ప్రత్యేక పూజలలో పాల్గొన్న కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్…
భక్తుల శ్రీరామ నామ స్మరణతో అయోధ్యను తలపించిన కోదండ సీతారామచంద్ర స్వామి ఆలయం…


సాక్షిత :శ్రీ రామ నవమి పర్వదినాన్ని పురస్కరించుకుని శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ అధ్యక్షతన పటాన్చెరులోని శ్రీ కోదండ సీతారామచంద్ర స్వామి ఆలయంలో సీతారాముల కల్యాణం అంగరంగ వైభవంగా,కన్నుల పండువగా జరిగింది.
ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తన కుటుంబ సభ్యులతో కలసి స్వామి వారిని దర్శించుకొని పట్టు వస్త్రాలు సమర్పించారు.
కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ కుటుంబ సమేతంగా స్వామి వారి కళ్యాణంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అద్భుతమైన అలంకరణతో,భక్తుల శ్రీరామ నామ స్మరణతో రాముల వారి కళ్యాణం ఆద్యంతం భక్తి పారవశ్యంతో, వైభవంగా జరిగింది.


ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ , మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ , మాజీ జెడ్పిటిసి జైపాల్ ముదిరాజు ,మాజీ కార్పొరేటర్ సప్పన్నదేవ్ , మాజీ కార్పొరేటర్ శంకర్ యాదవ్ ,బిఆర్ఎస్ సీనియర్ నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి , మార్కెట్ కమిటీ చైర్మన్ విజయకుమార్ , పట్టణ పుర ప్రముఖులు నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page