శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే…

Spread the love

శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే…

……..

సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, కుత్బుల్లాపూర్ 131 డివిజన్ పరిధిలోని చెరుకుపల్లి కాలనీ రామాలయం వద్ద శ్రీ వంశీ కృష్ణ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత 29 సంవత్సరాలుగా శ్రీ వంశీకృష్ణ యూత్ ఆధ్వర్యంలో జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించడం సంతోషించ దగ్గ విషయం అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీవైస్ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ బొడ్డు వెంకటేశ్వర రావు, కుత్బుల్లాపూర్ నియోజకవర్గ టీఆర్ఎస్ యూత్ ప్రెసిడెంట్ సోమేష్ యాదవ్, స్థానిక డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు దేవరకొండ శ్రీనివాస్, కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు కిషోర్ చారి, వెంకట్ రావు, కిషోర్ యాదవ్, రాందాస్, శ్రీనివాస్ యాదవ్, అశోక్ యాదవ్, రాజు, కిరణ్ యాదవ్, సురేందర్ రెడ్డి, రమేష్, శ్రీనివాస్ గౌడ్, వెంకటేష్, అజయ్ తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page