శ్రీ ఆచార్య రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ కమిటీ సభ్యులుగా మధు అన్న

Spread the love

కనిగిరి ఆగస్టు ,,,,,,,, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో బుర్ర మధుసూదన్ యాదవ్ కు జగనన్న సముచిత గౌరవ స్థానాన్ని ఏర్పరిచారని కనిగిరి వైసీపీ శ్రేణులు కొనియాడారు .శాసనసభ్యునిగా ఎన్నికైన తరువాత ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా, టీటీడీ పాలకమండలి సభ్యులుగా, నేడు జగనన్న ఆశీస్సులతో శ్రీ ఆచార్య రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ కమిటీ సభ్యులుగా కనిగిరి శాసనసభ్యులు బుర్రా మధుసూదన్ యాదవ్ ఎన్నికయ్యారని కనిగిరి వైసీపీ శ్రేణులు అభినందించారు.

ఈ సందర్భంగా కనిగిరి పట్టణ వైసీపీ శ్రేణులు మధు అన్నను ఘనంగా సన్మానించారు. కనిగిరి మున్సిపాలిటీ చైర్మన్ షేక్ అబ్దుల్ గఫార్, కనిగిరి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సానికొమ్ము రంగనాయకులు రెడ్డి, కనిగిరి సింగిల్ విండో అధ్యక్షులు సంగు సుబ్బారెడ్డి, కనిగిరి మునిసిపాలిటీ వైస్ చైర్మన్లు, మున్సిపాలిటీ కాస్మో పాలిటీ క్లబ్ కార్యదర్శి ఎస్ వి గోవర్ధన్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ షేక్ జిలాని భాష, విజేత కాలేజీ డైరెక్టర్ పసుపులేటి అరుణోధర్, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సచివాలయం కన్వీనర్లు, గృహ సారధులు మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా సన్మానించారు.

Related Posts

You cannot copy content of this page