జగన్,చంద్రబాబు,పవన్ కి చేతకాకపోతే ప్రత్యేక హోదా

SAKSHITHA NEWS

జగన్,చంద్రబాబు,పవన్ కి చేతకాకపోతే ప్రత్యేక హోదా కోసం మేమే మోడీ ప్రభుత్వం మెడలు వంచుతాం-నవతరంపార్టీ జాతీయ అధ్యక్షుడు రావుసుబ్రహ్మణ్యం.

విభజన హామీలు, ప్రత్యేక హోదా-రాయతీలు సాధించే క్రమంలో భావితరాల భవిష్యత్తుకి మార్గదర్శకత్వం అవసరమైన ఈ సమయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి చేతకాకపోతే మనమే మోడీ ప్రభుత్వం మెడలు వంచి ప్రత్యేక హోదా సాధించుకుందామని నవతరంపార్టీ జాతీయ అధ్యక్షుడు రావుసుబ్రహ్మణ్యం పిలుపునిచ్చారు.ప్రత్యేక హోదా విభజన హామీల సాధన సమితి నిర్వహిస్తున్న రౌండ్ టేబుల్ సమావేశంలో హక్కుల సాధన అవసరమని భావించే భావసారూప్యత ఉన్న అన్ని రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు, ఉద్యమ సంఘాలు, విద్యార్థి సంఘాలు, కార్మిక సంఘాలు అన్ని సంస్థలు ఉద్యమ కార్యాచరణపై నిర్దిష్టమైన సూచనలు, సలహాలు ఇచ్చి ఉద్యమం ఉవ్వెత్తున జరిగేలా ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ హక్కులు ఆత్మగౌరవ సాధన మలిదశ పోరాటంలో భాగస్వాములు కావాలని కోరారు.జనవరి 20వ తారీఖున(2024) ఉదయం 10 గంటలకు విజయవాడ MB భవన్లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశానికి చలసాని శ్రీనివాస్ అధ్యక్షత వహించారు.

సమావేశంలో నేతలు కామ్రేడ్ కే.రామకృష్ణ CPI రాష్ట్ర కార్యదర్శి, కామ్రేడ్ వి. శ్రీనివాసరావు CPI(M) రాష్ట్ర కార్యదర్శి, వి.వి. లక్ష్మీనారాయణ (జేడి),పోతిన రామారావు, జై భారత్ నేషనల్ పార్టీ అద్యక్షులు,తెలుగుసేన పార్టీ అధ్యక్షులు సత్యారెడ్డి,నవతరంపార్టీ నేతలు వై కృష్ణ కిషోర్ శర్మ, షేక్ రజాక్,కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సుంకర పద్మశ్రీ, ఆప్ జి ఫణిరాజ్ ,కందుల పరమేశ్వరరావు,కాంగ్రెస్ నేత నరసింహారావు,ఏ ఐ వై ఎఫ్ సుభాని, ఇతర పక్షాల నేతలు, ప్రజాసంఘాలు, ఇతర పెద్దలు, ఉద్యమ నేతలు హాజరు అయ్యారు.

Whatsapp Image 2024 01 20 At 11.42.31 Am

SAKSHITHA NEWS

sakshithanews

sakshithanews.com is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field

Related Posts

uttam బాలెంల ఘటనపై స్పందించిన మంత్రి ఉత్తంమ్ కుమార్ రెడ్డి

SAKSHITHA NEWS

SAKSHITHA NEWSuttam బాలెంల ఘటనపై స్పందించిన మంత్రి ఉత్తంమ్ కుమార్ రెడ్డి విచారణకు ఆదేశం uttam సూర్యాపేట జిల్లా బాలెంల ఎస్సీ మహిళా గురుకుల కళాశాల విద్యార్థినిల ఆందోళన, కళాశాల ప్రిన్సిపల్ గదిలో బీరు సీసాలు లభ్యమైన ఘటనపై రాష్ట్ర పౌరసరఫరాల,…


SAKSHITHA NEWS

varla వర్ల కుమార్ రాజా గెలుపుతో పామర్రు నియోజకవర్గానికి మహర్దశ

SAKSHITHA NEWS

SAKSHITHA NEWSvarla ఉయ్యూరు. varla వర్ల కుమార్ రాజా గెలుపుతో పామర్రు నియోజకవర్గానికి మహర్దశ;;తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షులు. వై వి బి రాజేంద్ర ప్రసాద్ పామర్రు నియోజకవర్గం నుండి శాసన సభ్యుడిగా ఎన్నికైన వర్లకుమర్ రాజా గారిని తెదేపా ఉపాధ్యక్షులు వై…


SAKSHITHA NEWS

You Missed

uttam బాలెంల ఘటనపై స్పందించిన మంత్రి ఉత్తంమ్ కుమార్ రెడ్డి

uttam బాలెంల ఘటనపై స్పందించిన మంత్రి ఉత్తంమ్ కుమార్ రెడ్డి

youth యువకులకు, సామాన్య ప్రజలకు తోడు గా ఉంటాం

youth యువకులకు, సామాన్య ప్రజలకు తోడు గా ఉంటాం

varla వర్ల కుమార్ రాజా గెలుపుతో పామర్రు నియోజకవర్గానికి మహర్దశ

varla వర్ల కుమార్ రాజా గెలుపుతో పామర్రు నియోజకవర్గానికి మహర్దశ

tamil nadu తమిళనాడు బీఎస్పీ పార్టీ అధ్యక్షుడు ఆర్మ్‌స్ట్రాంగ్ దారుణ హత్య?

tamil nadu తమిళనాడు బీఎస్పీ పార్టీ అధ్యక్షుడు ఆర్మ్‌స్ట్రాంగ్ దారుణ హత్య?

godavarikhani గోదావరిఖని కాలనీలలో పోలీసుల తనిఖీలు

godavarikhani గోదావరిఖని కాలనీలలో పోలీసుల తనిఖీలు

constitution రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తూ పార్టీ ఫిరాయింపులను

constitution రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తూ పార్టీ ఫిరాయింపులను

You cannot copy content of this page