అన్నదాన కార్యక్రమంలో పాల్గొని స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు

Spread the love

మేయర్ శ్రీమతి శ్రీ కోలన్ నీలా గోపాల్ రెడ్డి ,సీనియర్ నాయకులు శ్రీ కోలన్ గోపాల్ రెడ్డి ముఖ్య అతిధులుగా హిల్ కౌంటీ లోని శ్రీ వేంకటేశ్వర స్వామి దేవస్థానం నందు ఆలయ కమిటీ వారి ఆధ్వర్యంలో శ్రీ పద్మావతి గోదా సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి వారి షష్టమ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిత్య హోమం, చతుస్థానర్చనలు, మహాపూర్ణహుతి,అన్నదాన కార్యక్రమంలో పాల్గొని స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు మేకల వెంకటేష్,ఏనుగుల శ్రీనివాస్ రెడ్డి,సీనియర్ నాయకులు ఆవుల జగదీష్ యాదవ్,NMC బిఆర్ఎస్ జెనరల్ సెక్రెటరీ నాగరాజు యాదవ్,ఆలయ కమిటీ సభ్యులు నారాయణ మూర్తి,దుర్గాప్రసాద్,సీతారామారావు,నరసింహ రావు,ఇతర ముఖ్య సభ్యులు,స్థానిక కాలనీ అసోసియేషన్ సభ్యులు ఇతర ముఖ్యులు తదితరులు పాల్గొన్నారు

Related Posts

You cannot copy content of this page