దత్తాత్రేయ స్వామి వారికి విశేష పూజలు

Spread the love

దత్తాత్రేయ స్వామి వారికి విశేష పూజలు

శ్రీశైలం ఆలయం సాక్షిత మే :04:శ్రీశైలం మహా క్షేత్రంలో లోకకళ్యాణం కోసం దేవస్థానం వారు ఆలయ ప్రాంగణంలోని త్రిఫల వృక్షము  క్రింద వేంచేసి ఉన్న శ్రీదత్తాత్రేయ స్వామి వారికి విశేష పూజలు నిర్వహవహించినట్లు అధికారులు తెలియజేశారు మొదట దేవస్థానం వారి సర్కారీ సేవగా కైంకర్యం  నిర్వహించారు. ముందుగా పూజా కార్యక్రమం నిర్విఘ్నంగా జరుగుటకు మహాగణపతి పూజను నిర్వహించి తరువాత స్వామివారికి అభిషేకము, పుష్పాలంకరణ వివిధ రకాల నైవేద్యాన్ని స్వామివారికి సమర్పించినట్లు దేవస్థాన అధికారులు తెలియజేశారు
శ్రీశైలానికి దత్తాత్రేయస్వామి వారికి దగ్గర సంభందం వుందని,ఆలయ ప్రాంగణంలో త్రఫల వృక్షంక్రింద తపస్సు చేశారని, అందుకే ఈ వృక్షానికి దత్తాత్రేయ వృక్షమని పేరు ,ఈ కార్యక్రమంలో దేవస్థానం అధికారులు,పర్యవేక్షకులు, ఆలయ అర్చక,పరిచారకులు పాల్గొన్నారు

Related Posts

You cannot copy content of this page