SAKSHITHA NEWS

ప్రశాంతంగా ముగిసిన పోలీస్ కానిస్టేబుల్ వ్రాత పరీక్ష – యస్.పి అపూర్వ రావు

— మొత్తం 11239 మంది అభ్యర్థులకు గాను 11128 మంది అభ్యర్థులు హాజరు

నల్లగొండ (సాక్షిత ప్రతినిధి)

పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్ధులకు నిర్వహించిన తుది వ్రాత పరీక్షకి మొత్తం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 11239 మంది అభ్యర్థులకు గాను 111 మంది అభ్యర్థులకు గైహాజరు కాగా 11128 మంది హాజరయ్యారని జిల్లా యస్.పి అపూర్వరావు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అభ్యర్ధులకు ఎలాంటి సమస్యలు లేకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు నిర్వహించడం జరిగిందని తెలిపారు.అభ్యర్థులకు ఎవరైనా ఉద్యోగాలు ఇప్పిస్తామని మాయమాటలు చెప్పే వారి మాటలు విని మోసపోవద్దని సూచించారు. అలాంటి వారు ఎవరైనా ఉంటే వెంటనే డైయల్ 100 గానీ సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులకు సమాచారం అందించాలని తెలిపారు.


SAKSHITHA NEWS