సామజిక కార్యకర్త గుత్తా మునిరత్నం నాయుడు – విగ్రహ ఆవిష్కరణలో సీజేఐ

Spread the love

సామజిక కార్యకర్త గుత్తా మునిరత్నం నాయుడు – విగ్రహ ఆవిష్కరణలో సీజేఐ

*……….

సాక్షిత, తిరుపతి బ్యూరో:* తిరుపతి కేంద్రంగా సేవలు అందించే రాష్ట్రీయ సేవా సమితి (రాస్) స్థాపకులు, పద్మశ్రీ గుత్తా మునిరత్నం నాయుడు కష్టజీవి, సామజిక కార్యకర్త అని భారత సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ కొనియాడారు. దివంగత గుత్తా మునిరత్నం విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం శుక్రవారం జరిగింది. ఈ సందర్భంగా సీజేఐ మాట్లాడుతూ సంస్థ ఆశయాలకు అనుగుణంగా ప్రజలకు సేవలందించి, అంకితం చేయాలని సిబ్బందికి భారత ప్రధాన న్యాయమూర్తి సూచించారు. గ్రామీణ ప్రజలపై, వ్యవసాయం పై రైతులకు అండగా వుండాలని, పట్టణ పేదల సమస్యలకు పరిష్కారం చూపాలని కోరారు. విభిన్న ప్రతిభావంతులకు తోడుగా వుండాలని రాస్ సంస్థ స్థాపించి సామజిక కార్యక్రమాలు చేపట్టి పరిష్కారం చూపారని అన్నారు. ఎస్.జి.రంగా, రాజగోపాల నాయుడు వంటి స్వతంత్ర సమారయోదుల ఆశ్వీరాదాలతో సంస్థ ఉన్నత స్థితితో దాదాపు 21 కార్యక్రమాలను తమిళనాడు, ఒరిస్సా, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల్లో వేలమందికి మార్గదర్శిగా నిలిచి సేవలందిచారని అన్నారు. అలాగే మహా కవి గురుజాడ స్పూర్తితో దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ , దేశమును ప్రేమించుమన్నా .. మంచి అన్నదని పెంచుమన్నా .. స్వంతలాభం కొంత మానుకుని పొరుగు వారికి తోడ్పడవోయ్ అన్న మాటలతో అందరి హృదయాల్లో స్థానం సంపాదించుకున్న మునిరత్నం నాయుడుకి ఘనంగా నివాలులర్పిస్తునానని అన్నారు. చేసిన సేవలు చిరస్మరణీయం అందుకే ఆయనకు పద్మశ్రీ ప్రధానం చేయడం అతని సామాజిక సేవ పట్ల అంకితభావం, నిబద్ధత తెలుస్తుందని అన్నారు. అలాంటి సేవకుని విగ్రహావిష్కరణ చేయడం సంతోషంగా ఉందని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నానని జస్టిస్ రమణ అన్నారు.
అనంతరం రాస్ ముద్రించిన సేవా కార్యక్రమాల పుస్తకా న్ని భాతర ప్రధాన న్యాయమూర్తి ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో రాస్ సెక్రటరీ వెంకటరత్నం, రాస్ సంక్షేమ సంస్థల ప్రతినిధులు, లబ్దిదారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page