ఫోటో జర్నలిస్టులను సన్మానించిన సిద్దిపేట కాంగ్రెస్ నాయకులు

Spread the love

సాక్షిత – సిద్ధిపేట బ్యూరో చీఫ్ :
ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా సిద్దిపేటలో వివిధ పత్రికల్లో పనిచేస్తున్న ఫోటో జర్నలిస్టులను శనివారం టిపిసిసి సభ్యుడు దరిపల్లి చంద్రం పట్టణ అధ్యక్షుడు అత్తు ఇమామ్ కాంగ్రెస్ నాయకులు సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పగలు రాత్రి అనే తేడా లేకుండా తమ వృత్తినే దైవంగా భావిస్తూ ఫోటోగ్రాఫర్లు జీవనం సాగిస్తున్నారని అన్నారు.

జర్నలిస్ట్ లు తీసిన ఫోటోలతో ఎన్నో మధుర జ్ఞాపకాలు దాగి ఉంటాయని ఒక్కోసారి ఆ ఫోటోలను చూస్తే గతంలోకి వెళ్ళిపోతామని అన్నారు. మనం చనిపోయిన మన ఫోటోలు బతికే ఉంటాయని వాటిలో రాబోయే తరాల వారు చూసుకుంటారని అన్నారు. ఫోటో జర్నలిస్టులకు ప్రభుత్వం ఖాళీ స్థలాలు ఇచ్చి ఇల్లు నిర్మించి ఇవ్వాలని అన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే జర్నలిస్టులకు ఫోటో జర్నలిస్టులకు ఇల్లు నిర్మించి ఇస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు బిక్షపతి గ్యడరి మధు. గాయసుద్దిన్. అశోక్. రాగుల కనకయ్య. అనీల్ రఘుపతి మహారాజ్. నవీన్ ముత్యాల యాదగిరి తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page