గుండెపోటుతో మృతి చెందిన జెడ్పీటీసి కుటుంబాన్ని పరామర్శించిన శంకరన్న కుటుంబ సభ్యులు

Spread the love

మీకుటుంబానికి మాకుటుంబం అండగా వుంటుందని భరోసా కల్పించిన శంకర్ నారాయణ

*శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం పెనుకొండ మండల జెడ్పిటిసి గుట్టూరు శ్రీరాములు గుండెపోటుతో మృతి చెందారు.విషయం తెలుసుకున్న పెనుకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రస్థుత అనంతపురం పార్లమెంట్ అభ్యర్థి మాలగుండ్ల శంకర్ నారాయణ , వారి సోదరులు మాలగుండ్ల రవీంద్ర , మాలగుండ్ల మల్లికార్జున,హిందూపురం MP గోరంట్ల మాధవ్ గుట్టూరు గ్రామంలో శ్రీరాములు భౌతికయానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ సందర్భంగా శంకర్ నారాయణ మాట్లాడుతూ మీ కుటుంబానికి మా కుటుంబం అండగా ఉంటుందని భరోసాను కల్పించారు. మీ కుటుంబానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎల్లవేళలా
అండగా ఉంటుందని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page