అనునిత్యం అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి : శంభీపూర్ క్రిష్ణ.

Spread the love

కుత్బుల్లాపూర్ నియోజకవర్గ, బీఅర్ఎస్ నేత, కౌన్సిలర్ శంభీపూర్ క్రిష్ణ ని నియోజకవర్గ పరిధిలోని ప్రజలు, కాలనీ వాసులు శంభీపూర్ లోని కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.. రేపు అనగా మార్చ్ 01వ తేదీ నుండి 3వ తేదీ వరకు డి.పోచంపల్లి గ్రామం 10వ వార్డులో జరగబోయే శ్రీశ్రీశ్రీ హరీహర క్షేత్ర విగ్రహ ప్రతిష్టా మరియు ద్వజ స్థంభ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొనాలని ఆలయ కమిటీ సభ్యులు బొంగునురి శ్రీనివాస్ రెడ్డి (మాజీ ఉప సర్పంచ్) మరియు ఆలయ కమిటీ సభ్యులు వారిని మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వాన పత్రికను అందజేసి ఆహ్వానించారు..
అనంతరం మార్చ్ నెల 04వ తేదీన నాగులూర్ గ్రామంలో శివ స్వాముల మహా పడి పూజా మరియు 14వ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొనాలని గురుస్వామి బిక్షపతి గారు క్రిష్ణ గారిని మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వానించారు…

Related Posts

You cannot copy content of this page