ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి : శంభీపూర్ క్రిష్ణ..

Spread the love

కుత్బుల్లాపూర్ నియోజకవర్గ, బీఅర్ఎస్ నేత, కౌన్సిలర్ శంభీపూర్ క్రిష్ణ ని నియోజకవర్గ పరిధిలోని ప్రజలు, కాలనీ వాసులు శంభీపూర్ లోని కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది..

ఈ నెల 26వ తేదీ నుండి దుందిగల్ గ్రామంలో జరగబోయే శ్రీశ్రీశ్రీ గొల్లకేతమ్మ, బలిజమేడలమ్మ సమేత మల్లికార్జున స్వామి వారి కళ్యాణ మహోత్సవ జాతరలో పాల్గొనాలని ఆలయ కమిటీ సభ్యులు జక్కుల క్రిష్ణ యాదవ్ (ఎక్స్ సర్పంచ్, కౌన్సిలర్) జక్కుల విజయ శ్రీనివాస్ యాదవ్ (కౌన్సిలర్) మరియు జక్కుల మల్లేష్ యాదవ్ (ఆలయ కమిటీ అధ్యక్షులు) శంభీపూర్ క్రిష్ణ నీ మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వానించారు.. దుందిగల్ మునిసిపల్ బీఆర్ఎస్ పార్టీ ఉపాధ్యక్షులు శివ యాదవ్ జన్మదిన సందర్భంగా శంభీపూర్ క్రిష్ణ ని కార్యాలయంలో మర్యాదాపుర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు…

Related Posts

You cannot copy content of this page