ద్రౌపదమ్మకు పట్టువస్తాలు సమర్పించిన మంత్రి రోజా సెల్వమణి దంపతులు

Spread the love

ద్రౌపదమ్మకు పట్టువస్తాలు సమర్పించిన మంత్రి రోజా సెల్వమణి దంపతులు

రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక వ్యవహారాల యువజన సర్వీసుల క్రీడాశాఖ మంత్రివర్యులు శ్రీమతి ఆర్.కె.రోజా సెల్వమణి దంపతులు పుత్తూరు పట్టణంలో వెలసిన ద్రౌపతి దేవి సమేత ధర్మరాజుల స్వామి వారి ఆలయంలో జరుగుతున్న తిరునాళ్లు సందర్భంగా ఊరేగింపుగా అమ్మవారికి మంగళవారం పట్టువస్త్రాలు సమర్పించారు.

మంత్రి దంపతులకు పురవీధులలో ప్రజలు ఘన స్వాగతం పలికారు.

ఆలయ నిర్వాహకులు
ఘనంగా స్వాగతం పలికారు. ఆలయంలో పూజారులు విశేష పూజలు నిర్వహించి, వేద మంత్రాల మధ్య మంత్రి రోజా సెల్వమణి దంపతులను ఆశీర్వదించి, ద్రౌపదమ్మ వారి చిత్రపటాన్ని బహుకరించారు.

అంతేకాకుండా ద్రౌపదీ అమ్మవారికి బంగారు తాళిబొట్టు ను మంత్రి దంపతులు తమ వంతు విరాళంగా భక్తి పూర్వకంగా సమర్పించారు. అనంతరం హరికధా కార్యక్రమాన్ని విక్షించారు

ఈ కార్యక్రమంలో మునిసిపల్ చైర్మన్, వైస్ చైర్మన్లు కౌన్సిలర్లు కమీషనర్ ,ప్రజా ప్రతినిదులు, అధికారులు, వైఎస్ఆర్సిపి నాయకులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page