పార్లమెంట్ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా సికింద్రాబాద్ నియోజకవర్గం మెట్టుగూడా డివిజన్

Spread the love

సికింద్రాబాద్ పార్లమెంట్ :-
పార్లమెంట్ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా సికింద్రాబాద్ నియోజకవర్గం మెట్టుగూడా డివిజన్ లో పాదయాత్ర నిర్వహించిన బి.ఆర్.ఎస్ పార్టీ ఎం.పి అభ్యర్థి టి.పద్మారావు గౌడ్… డివిజన్ ఇంచార్జ్ కిషోర్ గౌడ్ , స్థానిక కార్పొరేటర్ రాసురి సునీత తో కలిసి DBR , SVS గల్లీ , పాండవుల బస్తి , దూది బావి , పార్త్తి వాడ , చింత బావి , పలు కాలనిలలో ఇంటింటికి వెళ్లి బి.ఆర్.ఎస్ పార్టీ కి ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్థించిన టి.పద్మారావు గౌడ్…

పద్మారావు గౌడ్ మాట్లాడుతూ మెట్టుగూడా డివిజన్ లోని ప్రతి గడప లో ఓటర్ల నుండి విశేష స్పందన వస్తుంది.మీరు ప్రచారానికి రాకపోయినా మా ఓటు మీకే వేస్తామని ఓటర్లు నాకు తెలుపుతున్నారు.గత ప్రభుత్వ హయాంలో మెట్టుగూడా డివిజన్ ని ఎంతో అభివృద్ధి చేసాను.అసెంబ్లీ ఎన్నికల ఏ విధంగా అయితే భారీ మెజారిటీతో గెలిపించిండ్రో అదే ఉత్సాహం తో పార్లమెంట్ ఎన్నికలలో కూడా బి.ఆర్.ఎస్ పార్టీ కి ఓటు వేసి అత్యధిక మెజారిటీ వచ్చే విధంగా ప్రతి కార్యకర్త కృషి చేస్తూ ముందుకు వెళ్లాలని కోరుతున్నాను…

ఈ కార్యక్రమంలో సికింద్రాబాద్ అసెంబ్లీ ఇంచార్జ్ మేడే రాజీవ్ సాగర్ , బి.ఆర్.ఎస్ పార్టీ రాష్ట్ర యువజన విభాగం నాయకులు రామేశ్వర్ గౌడ్ , కిరణ్ గౌడ్ , కార్పొరేటర్లు లింగాని లక్ష్మీ ప్రసన్న , సామల హేమ , కంది శైలజ , స్థానిక నాయకులు , కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు…

Related Posts

You cannot copy content of this page