పార్లమెంట్ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా సికింద్రాబాద్ బి.ఆర్.ఎస్ పార్టీ ఎం.పి అభ్యర్థి టి.పద్మారావు గౌడ్

Spread the love

పార్లమెంట్ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా సికింద్రాబాద్ బి.ఆర్.ఎస్ పార్టీ ఎం.పి అభ్యర్థి టి.పద్మారావు గౌడ్ కు మద్దతుగా సికింద్రాబాద్ నియోజకవర్గంలోని అన్ని డివిజన్ లకు సంబంధించి బి.ఆర్.ఎస్ పార్టీ సీనియర్ నాయకుల అధ్వర్యంలో సీతాఫల్ మండి డివిజన్ టి.ఆర్.టి క్వాటర్స్ లో ఏర్పాటు చేసిన సమన్వయ సమావేశం కు హాజరై భారీ మెజారిటీ తో సాధించే దిశగా కార్యకర్తలు కృషి చేయాలని కోరుతూ , ఓటర్ల జాబితాలను అందజేసిన ఎం.పి అభ్యర్థి పద్మారావు గౌడ్….

అనంతరం ఎం.పి అభ్యర్థి పద్మారావు గౌడ్ మాట్లాడుతూ ఎన్నికలు నెలన్నర రోజులు ఉన్నాయి. కాబట్టి తక్కువ మంది తో ఈ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాం.మనకు వేల మంది సైన్యం ఉన్నాం మనం.ఈ సారి కేసీఆర్ రోడ్ షో పెట్టడానికి ప్రయత్నిస్తున్నాం. రాష్ట్రమంతా 64 సీట్ల తో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది.కానీ హైదరాబాద్ లో మాత్రం ఒక్కసీటు కూడా కాంగ్రెస్ పార్టీ కి రాలేదు.హైదరాబాద్ నగరమంతా బి.ఆర్.ఎస్ పార్టీ కి పట్టం కట్టిండ్రు…అదే బి.ఆర్.ఎస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికలకు పట్టు… ఈ ఎన్నికలు అంత సులువు కాదు ఎందుకంటే ఇటు రాష్ట్ర ప్రభుత్వం , అటు కేంద్ర ప్రభుత్వం తో కొట్లాడుతున్నాం..కాబట్టి ప్రతి కార్యకర్త సమన్వయం తో పని చేసి ఎం.పి ఎన్నికల్లో బి.ఆర్.ఎస్ పార్టీ ని గెలిపించాలి…. హైదరాబాద్ లో అభివృద్ధి ప్రతి ఒక్క ఓటరుకు కనిపిస్తున్నది.అందుకే హైదరాబాద్ లో ప్రతి ఎం.ఎల్.ఏ ను బి.ఆర్.ఎస్ పార్టీ తరపున ప్రజలు గెలిపించారు..దీనికి తోడు అందరికి అందుబాటులో ఉంటారు..

ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు సామల హేమ , లింగాని ప్రసన్న లక్ష్మీ , కంది శైలజ , రాసురి సునీత , యువజన విభాగం నాయకులు రామేశ్వర్ గౌడ్ , కిరణ్ గౌడ్ , బి.ఆర్.ఎస్ పార్టీ సీనియర్ నాయకుల తో పాటు అయిదు డివిజన్ లకు సంబంధించి బి.ఆర్.ఎస్ పార్టీ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు….
,,,,,,,,,,,,,,,,,,,

Related Posts

You cannot copy content of this page