జీపీఎస్ ల సమ్మెకు మద్దతు తెలిపిన సర్పంచ్ లు

జీపీఎస్ ల సమ్మెకు మద్దతు తెలిపిన సర్పంచ్ లు

SAKSHITHA NEWS

జీపీఎస్ ల సమ్మెకు మద్దతు తెలిపిన సర్పంచ్ లు

చిట్యాల సాక్షిత ప్రతినిధి

నాలుగు సంవత్సరాలు ప్రోబేషన్ కాలాన్ని పూర్తి చేసుకున్న జూనియర్ పంచాయతీ కార్యదర్శులు తమను రెగ్యులర్ చేయాలని చేపట్టిన సమ్మె ఈరోజు 4వ రోజుకు చేరుకుంది. వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొని న్యాయబద్ధమైనటువంటి జూనియర్ పంచాయతీ కార్యదర్శుల డిమాండ్ పై ప్రభుత్వం వెంటనే స్పందించి వారిని రెగ్యులర్ చేయాలని కోరారు. కార్యదర్శుల సమ్మె కు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని ప్రకటించారు.
ప్రభుత్వం ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో లబ్ధిదారులకు చేరవేయడంలో పంచాయతీ కార్యదర్శుల కృషి ఎనలేనిదని, కరోనా సమయంలో కూడా తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా విధులను నిర్వహించిన ఘనత పంచాయితీ కార్యదర్శుల దేనని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో వట్టిమర్తి సర్పంచ్ బుర్రి రవీందర్ రెడ్డి, వెలిమినేడు సర్పంచ్ దేశబోయిన మల్లమ్మ, వెంబావి సర్పంచ్ అద్దెల నర్సిరెడ్డి,
బోయగుబ్బ సర్పంచ్ కంచర్ల సునీత వెంకట్ రెడ్డి,
బొంగోని చెర్వు సర్పంచ్ సామిడి మోహన్ రెడ్డి, వెలిమినేడు ఎంపీటీసీ దేశబోయిన స్వరూప, పిట్టంపల్లి ఉపసర్పంచ్ మెట్టు పరమేష్ మరియు వివిధ గ్రామాల కార్యదర్శులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS