సంజీవయానగర్ శ్రీ నల్ల పోచమ్మతల్లి ఆలయం 6వ వార్షికోత్సవం సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు

Spread the love

సంజీవయానగర్ శ్రీ నల్ల పోచమ్మతల్లి ఆలయం 6వ వార్షికోత్సవం సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే కె పి వివేకానంద్….

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 131 కుత్బుల్లాపూర్ డివిజన్ పరిధిలోని సంజీవయానగర్ లోని శ్రీ నల్ల పోచమ్మతల్లి ఆలయం 6వ వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ముఖ్య అతిథిగా పాల్గొని అమ్మ వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలపై అమ్మవారి చల్లని చూపు ఉండాలని ప్రజలు సుఖ సంతోషాలతో ఆరోగ్యాలతో ఉండేలా చూడాలని వేడుకున్నానని తెలిపారు. భక్తిశ్రద్ధలతో అమ్మవారి వార్షికోత్సవాలను నిర్వహిస్తున్నందుకు ఆలయ కమిటీ వారిని అభినందించారు.


ఈ కార్యక్రమంలో నియోజకవర్గ యూత్ అద్యేక్షులు సోమేశ్ యాదవ్, కాలనీ మరియు ఆలయ కమిటీ ప్రెసిడెంట్ యాదగిరి, విజయ్ గుప్త, ఉమేష్, నగేష్, దుర్గపాతి, కోటస్వామి, అజేయ కుమార్, ఆలయ కమిటీ సభ్యులు భక్తులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page