మహిళల భద్రత కు ప్రాదాన్యం …వేదింపులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు : సీపీ రామగుండం

Spread the love

ఆపదలో తోడుగా….మహిళలకు అండగా పూర్తి భద్రతనిస్తున్న రామగుండం కమీషనరేట్ షీ టీమ్స్‌
రామగుండము పోలీస్ కమీషనరేట్ పరిదిలో మహిళల భద్రత కోసం ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు, వారి ఫిర్యాదుల పట్ల సత్వరమే స్పందించి తగిన విధంగా న్యాయం చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు రామగుండము పోలీస్ కమీషనర్ ఎం.శ్రీనివాస్ ఐపీఎస్.,(ఐజి) తెలిపారు. మహిళలకి ప్రయాణాల్లో, పని ప్రదేశాల్లో , ఇతర చోట్ల ఎదురయ్యే వివిధ రకాల వేధింపుల నుండి రక్షణ కోసం షి టీమ్స్ బృందాలు అన్ని వేళలా అందుబాటులో ఉంటాయని అన్నారు. ఫిర్యాదులు తీసుకోవడం మొదలు పరిష్కారం చూపే వరకు మొత్తం ప్రక్రియలో బాధితుల వివరాలు అత్యంత గోప్యంగా ఉంచుతారు. బాధితులకు నిత్యం అండగా ఉండి ధైర్యం చెప్తారు. నేరుగా షీ టీం బృందాలను కలిసి ఫిర్యాదు చేయాల్సిన పనిలేదు. డయల్‌ 100, వాట్సాప్‌, క్యూఆర్‌కోడ్‌ తదితర అనేక విధానాల్లోనూ ఫిర్యాదులు చేయవచ్చు అన్నారు. మహిళలు మరియు పిల్లల పట్ల నేరాలు ఎక్కువగా జరుగుతున్నాయి అని ముందుగానే గుర్తించబడిన ఇబ్బందికర ప్రాంతాలలో SHE టీమ్స్ ప్రతిరోజూ తమ పరిధిలో తనిఖీ చేస్తుంది నిరంతర నిఘా ఉంటుంది ఆడపిల్లలను,మహిళలను వేధించినా, అసభ్యంగా ప్రవర్తించినా, తిట్టినా, వారి ఫొటోలు, వీడియోలు మార్ఫింగ్‌ చేసినా, సోషల్‌ మీడియా అకౌంట్లలో పోస్టు చేసినా, మిత్రులకు షేర్‌ చేసినా తీవ్రమైన నేరంగా పరిగణించి.. ఎలాంటి కఠిన శిక్షలు వేస్తున్నారో షీటీమ్స్‌ కాలేజీల్లో, స్కూళ్లలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఒకవేళ నిందితుడు మైనర్ అయితే అతడికి తల్లితండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది.

రామగుండం కమినరేట్ నందు 2024 సంవత్సరం లో ఇప్పటి వరకు (19 మార్చ్ 2024 ) షి టీమ్ అవగాహన కార్యక్రమాలు 166 నిర్వహించడం జరిగింది….

ఈ సంవత్సరంలో ఇప్పటివరకు 15 మంది అమ్మాయిలు రామగుండం పోలీస్ కమిషనరేట్ షీ టీం వారిని ఆశ్రయించగా వారిని వేధించిన వారిని పట్టుకుని వారిలో కొంతమంది పై కేసులు నమోదు చేయడం జరిగింది మరియు కొంతమందిని కౌన్సిలింగ్ చేసి బైండ్ ఓవర్ చేయడం జరిగింది.

గత వారం రోజులుగా ఇంటర్మీడియట్ మరియు 10వ తరగతి పరీక్ష కేంద్రాల వద్ద మోటార్ సైకిల్ పై ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ అమ్మాయిలని ఈవిటీజింగ్ చేస్తున్న 12 మందిని ఆకతాయి లను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని వారి వద్ద నుండి ఏడు మోటర్ సైకిల్స్ స్వాధీనం చేసుకుని వారందరిపై పెద్దపెల్లి, మంచిర్యాల, సిసిసి నస్పూర్ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు చేయడం జరిగింది
ఎవరైనా మహిళలు వేధింపులకు గురైనట్లయితే వెంటనే డయల్ 100, షీ టీం నెంబర్ 6303923700 ఫోన్ చేసి లేదా వాట్సప్ ద్వారా సమాచారం ఇవ్వవచ్చు వెంటనే అందుబాటులో ఉంటుంది. మహిళల వివరాలు గోప్యంగా ఉంచబడతాయని అని తెలిపారు

Related Posts

You cannot copy content of this page