ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపిన రాజీవ్ గాంధీ నగర్ వాసులు…

Spread the love

Residents of Rajiv Gandhi Nagar thanked MLA

ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపిన రాజీవ్ గాంధీ నగర్ వాసులు…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని రాజీవ్ గాంధీనగర్ సర్వే నెంబర్ 79లో నెలకొన్న రెవెన్యూ సమస్యను అసెంబ్లీ వేదికగా మాట్లాడి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన నేపథ్యంలో బస్తీ వాసులు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ని తన నివాసం వద్ద మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు.

రాజీవ్ గాంధీ నగర్ సర్వే నెంబర్ 79లో కోర్టు కేసు వల్ల పట్టాలు పెండింగ్ లో ఉన్నాయని, ప్రస్తుతం కోర్టు కేసు సమస్య పరిష్కారం అయినా పేదలకు పట్టాలు మంజూరు కాలేదని, సమస్యను పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని అసెంబ్లీ వేదికగా ఎమ్మెల్యే మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బస్తీ కమిటీ సభ్యులు, పెద్దలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page