పటాన్చెరులో ఆర్డీవో కార్యాలయం, పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటు చేస్తూ జీవోల జారీ

Spread the love

ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్చెరు

సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలో పాలిటెక్నిక్ కళాశాల, రెవెన్యూ డివిజన్ ఏర్పాటునకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం జీవోలను జారీ చేసిందని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. ఇటీవల పటాన్చెరులో నిర్వహించిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీలకు అనుగుణంగా వీటికి సంబంధించి జీవోలు జారీ చేయడం జరిగిందని తెలిపారు.

శుక్రవారం పటాన్చెరు పట్టణంలోని జిఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఇందుకు సంబంధించిన వివరాలను ఆయన వెల్లడించారు. వీటితో పాటు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. ముఖ్యమంత్రి కెసిఆర్ కు నియోజకవర్గ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలిపారు. హాజరైన అన్ని స్థాయిల ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు కార్యకర్తలు.

Related Posts

You cannot copy content of this page