రామచంద్రా రెడ్డి బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో ఆకస్మికంగా మరణించారు

Spread the love

మాజీ మంత్రి, ఆదిలాబాద్ జిల్లాకు చెందిన సి. రామచంద్రారెడ్డి గారు కొద్దిసేపటి క్రితం నిమ్స్ ఆసుపత్రిలో మరణించారు.

కొద్దిరోజుల క్రితం అనారోగ్యంతో నిమ్స్ లో చేరిన రామచంద్రా రెడ్డి బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో ఆకస్మికంగా మరణించారు.

ఆయన నాలుగు సార్లు ఎమ్మెల్యే గా రెండు సార్లు మంత్రిగా పని.చేశారు

మాజీ మంత్రి రామచంద్రా రెడ్డి ఆకస్మిక మృతి పట్ల టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

కాంగ్రెస్ సీనియర్ నాయకులు మాజీ మంత్రి రామచంద్రా రెడ్డి మరణం కాంగ్రెస్ పార్టీకి తారని లోటు అని ఆయన అన్నారు.

రామచంద్రారెడ్డి జీవిత కాలం ప్రజా సేవకు అంకితమయ్యారని నిజాయిత, క్రమశిక్షణ తో.రాజకీయాలు చేసిన గొప్ప వ్యక్తి రామచంద్రా రెడ్డి గారు అని ఆయన అన్నారు..

ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నా అని రేవంత్ రెడ్డి అన్నారు..

Related Posts

You cannot copy content of this page