SAKSHITHA NEWS

ఆర్.డబ్ల్యూ.ఎస్ డిపార్టమెంట్ పై సమీక్ష నిర్వహించిన శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి

నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి నరసరావుపేట నియోజకవర్గంలోని మండల పరిషత్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో సర్పంచ్లు, ఎంపీటీసీలతో ఆర్.డబ్ల్యూ.ఎస్ డిపార్టమెంట్ పై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీడబ్ల్యూ, జల్ జీవన్ మిషన్ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో నీటి సరఫరాపై ఆరా తీశారు. పలు గ్రామాల్లో తాగు నీటి సమస్య ఉన్న చోట చేపట్టవలసిన చర్యలు, ఎస్టిమేషన్స్, టెండర్లు పిలవడం వంటి వాటిపే వివరాలు సేకరించారు. రానున్న నెల రోజుల్లో గ్రామాల్లో ఆర్ డబ్ల్యూ ఎస్ శాఖ వారు, ఎంపీడీలతో సమన్వయం చేసుకుంటూ పనులు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. జెడ్పీ నిధులతో పాటు, పలు గ్రామాల్లో తాగు నీటి కోసం స్వచ్ఛందంగా పలువురు ముందుకు వచ్చి విరాళాలు ఇవ్వనున్నట్లు తెలిపారు.


SAKSHITHA NEWS