కుత్బుల్లాపూర్ నియోజకవర్గం లోని దుండిగల్ మునిసిపాలిటిలోని సాయి పూజ కాలనీలో నిర్వహించిన కంటి పరిక్ష శిబిరం

Spread the love

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం లోని దుండిగల్ మునిసిపాలిటిలోని సాయి పూజ కాలనీలో నిర్వహించిన కంటి పరిక్ష శిబిరంలో అవసరమైన వారికీ శస్త్రచికిత్స చేయించిన నర్సారెడ్డి భూపతిరెడ్డి
శస్త్రచికిత్స చేయించుకున్న వారు ఈరోజు భూపతిరెడ్డి కార్యాలయానికి వచ్చి ధన్యవాదాలు తెలిపారు.శస్త్రచికిత్స అనంతరం కంటిచూపు మెరుగ్గా అయ్యిందని,తమ లాంటి పేదవారికి సహాయం చేస్తున్న భూపతిరెడ్డి కి ఆ దేవుని ఆశిస్సులు ఎల్లప్పుడూ ఉంటాయని తెలిపారు.
ఈ సందర్భంగా నర్సారెడ్డి భూపతిరెడ్డి మాట్లాడుతూ, కంటికి సంబంచిన ఇబ్బందితో బాధపడుతున్న పేదలందరికీ ఉచితంగా శస్త్రచికిత్సలు చేయిస్తామని,అవసరమైన పేదవారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు బొంగునూరి శ్రీనివాస్ రెడ్డి ,బౌరంపేట్ మాజీ సర్పంచ్ మిద్దెల యాదిరెడ్డి , వొంపుగూడెం రాజిరెడ్డి , మాజీ వార్డ్ మెంబెర్ పరశురాం గౌడ్ ,ధర్మ రెడ్డి ,జీవన్ ,శ్రీను తదితరులు పాల్గొన్నారు

Related Posts

You cannot copy content of this page