చీమలపాడు ఘటనలో క్షతగాత్రుడైన హేడ్ కానిస్టేబుల్ ను పరామర్శించిన పువ్వాడ

Spread the love

చీమలపాడు ఘటనలో క్షతగాత్రుడైన హేడ్ కానిస్టేబుల్ ను పరామర్శించిన పువ్వాడ..

సాక్షిత ఖమ్మం బ్యూరో చీఫ్:

ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గం చీమలపాడు అగ్నిప్రమాద ఘటనలో క్షతగాత్రుడై కాలు కోల్పోయి సంకల్ప ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న హేడ్ కానిస్టేబుల్ దావా నవీన్ ను రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కలిసి పరామర్శించారు.
ఏమి అధైర్య పడొద్దు అని, వారికి ధైర్యం కల్పించారు. పూర్తిగా కోలుకునే వరకు అన్ని రకాల వైద్య చికిత్సలు అందిస్తామని, దైర్యం కోల్పోవొద్దు దైర్యం చెప్పారు. ఇప్పటికే శాఖ మంత్రి, పోలీస్ కమిషనర్ తో మాట్లాడామని ప్రభుత్వం తరుపున పూర్తి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఎలాంటి వైద్య సేవలైన తక్షణమే అందించాలని, పూర్తిగా కోలుకునేవరకు మెరుగైన చికిత్సలను అందించాలని వైద్యులకు సూచించారు.

Related Posts

You cannot copy content of this page