SAKSHITHA NEWS

cc కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుందిగల్ మునిసిపాలిటీ పరిధి దుందిగల్ 5వ వార్డులోని రూ.15 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మిస్తున్న సిసి రోడ్డు మరియు అందర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులను వైస్ చైర్మన్ పద్మా రావు తో కలిసి ప్రారంభించిన కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేత, కౌన్సిలర్ శంభీపూర్ క్రిష్ణ … అనంతరం వారు వార్డులో పర్యటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అభివృద్ధికి ఎల్లవేలలా కృషి చేస్తామన్నారు. ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించే దిశగా పనిచేస్తామన్నారు. వర్షాకాలం నేపథ్యంలో నిర్మాణ పనుల్లో జాప్యం లేకుండా పూర్తి చేయాలని నాణ్యతలో రాజీ పడొద్దు అని వీలైనంత త్వరగా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కాంట్రాక్టర్ కి సూచించారు….. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు జక్కుల క్రిష్ణ యాదవ్, ఆనంద్ కుమార్, గోపాల్ రెడ్డి, శంకర్ నాయక్, మహేందర్ యాదవ్, సీనియర్ నాయకులు సుధాకర్ రెడ్డి, యువ నాయకులు విష్ణు యాదవ్, నాయకులు ఉప్పరి క్రిష్ణ, అమరం ముత్యం రెడ్డి, శంకరప్ప, బాల్ రెడ్డి,నాగేష్, దార మహేష్, భాస్కర్, అప్ప, నవీన్, క్రిష్ణ రెడ్డి, కుమ్మరి క్రిష్ణ, రాజు, భాను, మరియు కాలనీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు….

cc

SAKSHITHA NEWS