పిజెఆర్ నగర్ కమిటీ హాల్లో జిహెచ్ఎంసి వారు పబ్లిక్ కాంటాక్ట్ ప్రోగ్రాం

Spread the love

124 డివిజన్ ఎల్లమ్మబండ పరిధిలోని పిజెఆర్ నగర్ కమిటీ హాల్లో జిహెచ్ఎంసి వారు పబ్లిక్ కాంటాక్ట్ ప్రోగ్రాం పేరుతో అన్ని శాఖల అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్యఅతిథిగా డివిజన్ కార్పొరేటర్ శ్రీ దొడ్ల వెంకటేష్ గౌడ్ పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ డివిజన్లో ఉన్న అన్ని కాలనీలలో వంద రోజులపాటు ఈ ప్రోగ్రాం నిర్వహించబడుతుందని అధికారులే మీ దగ్గరికి వచ్చారు కాబట్టి ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కాలనీలో ఏ సమస్య ఉన్న వారి దృష్టికి తీసుకురావాలని కాలనీ వాసులకు సూచించారు.

కార్యక్రమంలో యువనేత దొడ్ల రామకృష్ణ గౌడ్, డివిజన్ అధ్యక్షులు సమ్మారెడ్డి, గౌరవ అధ్యక్షులు అనిల్ రెడ్డి, ఉపాధ్యక్షులు కాశినాథ్ యాదవ్, మాజీ అధ్యక్షులు పాండుగౌడ్ మరియు జిల్లా గణేష్, అగ్రవాసు, సంగమేష్, మౌలానా, రవీందర్, బాబు నాయక్, పుట్టం దేవి, రేణుక, సురేఖ, ప్రీతి, బుజ్జమ్మ తదితరులు పాల్గొన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page