సైకో జగన్ రెడ్డి పాల్పడుతున్నారు మాజీ శాసనసభ్యులు ఉన్నం హనుమంతరాయ చౌదరి…

Spread the love

నాలుగు నెలల్లో అధికారం కోల్పోతున్నానన్న అక్కసుతోనే ప్రజావ్యతిరేక చర్యలకు సైకో జగన్ రెడ్డి పాల్పడుతున్నారు మాజీ శాసనసభ్యులు ఉన్నం హనుమంతరాయ చౌదరి…

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం ఎర్రంపల్లి గ్రామం నందు పత్రికా సమావేశం:- జగన్ రెడ్డి లాంటి నేరగాడి చేతిలో మన రాష్ట్రాన్ని పెట్టాం. అప్పుడు అతను నేరగాళ్లంతా సమాజంలో స్వేచ్ఛగా తిరగాలి నిజాయితీ గల వాళ్ళు, అన్యాయాన్ని ప్రశ్నించే వాళ్ళు జైళ్లలో ఉండాలి. మొత్తం మీద రాష్ట్రం ఒక నేర సామ్రాజ్యం కావాలి అనే అనుకుంటాడు.

అందులోనూ ఆ నేరగాడు ఒక సైకో జగన్ రెడ్డి మన ముఖ్యమంత్రి. ఏదైనా ఉంటే పోలీసులు ముందస్తు నోటీసులు ఇచ్చి చర్యలు చేపట్టాలి. అలాకాకుండా తాడేపల్లి ఆదేశం మేరకు పోలీసులు అర్ధరాత్రి వెళ్లి హంగామా సృష్టించాల్సిన అవసరమేమొచ్చింది? లోకేష్ తోపాటు రాష్ట్రవ్యాప్తంగా టిడిపి నేతలను నిర్బంధించటం దుర్మార్గం. జగన్ సర్కార్ ప్రతిపక్షాలను వేధించటానికి ఇది పరాకాష్ట. మా అధినేత అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాను. ఏది ఏమైనా న్యాయం ధర్మం తప్పకుండా విజయం సాధిస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను……

Related Posts

You cannot copy content of this page