SAKSHITHA NEWS

రాజీవ్ గాంధీ యూత్ క్విజ్ కాంపిటీషన్ సన్నాహక సమావేశం నిర్వహించిన టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రంగినేని అభిలాష్ రావు

కొల్లాపూర్ నియోజకవర్గంలోని చిన్నంబావి మండలంలోని ఇందిరా గాంధీ ఆడిటోరియంలో కాంగ్రెస్ నాయకులతో కలసి క్విజ్ కాంపిటీషన్ గురించి సన్నహక సమావేశం నిర్వహించడం జరిగింది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వనపర్తి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్ యాదవ్ విచ్చేయడం జరిగింది.

ఈ సందర్భంగా రంగినేని అభిలాష్ రావు గారు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా యువత మేల్కొనే దిశగా హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ స్ఫూర్తితో రాజీవ్ గాంధీ ఆన్లైన్ క్విజ్ పోటీలను నిర్వహిస్తున్నారు.

మన దేశానికి రాజీవ్ గాంధీ చేసిన సేవలను కాంగ్రెస్ కుటుంబ సభ్యులకు తెలియజేస్తూ మరొక్క సారి మననం చేసుకుంటూ కొనియడడం జరిగింది.

రాజీవ్ గాంధీ ఆన్లైన్ క్విజ్ కాంపిటీషన్ లో 16 సం” నుంచి 35 సంవత్సరాలు ఉన్న ప్రతి ఒక్కరూ క్విజ్ కాంపిటీషన్ లో పాల్గొనే విధంగా మనమందరం ప్రతి ఒక్కరికీ తెలియజేయాలని సూచించారు.

యువత పోటీ పరీక్షల్లో మరియు రాజకీయాల్లో చురుగ్గా పాల్గొని వారి యొక్క ప్రతిభను చాటాలని అభిలాష్ రావు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో వనపర్తి జిల్లా అద్యక్షులు రాజేంద్ర ప్రసాద్ యాదవ్ ,రాష్ట్ర సోషల్ మీడియా సెక్రటరీ పరమేష్ , వనపర్తి జిల్లా మహిళా అధ్యక్షురాలు శ్రీలత రెడ్డి , నాగర్ కర్నూల్ జిల్లా ప్రధాన కార్యదర్శి కంటే శివన్న ,జిల్లా సేవాదళ్ జనరల్ సెక్రెటరీ రఫీ ఉద్దీన్ , వనపర్తి జిల్లా ఎస్సీ సెల్ కార్యదర్శి మద్దిలేటి , పెద్దకొత్తపల్లి,వీపనగండ్ల,పెంట్లవెల్లి మండలాల అధ్యక్షులు తగిలి కృష్ణయ్య ,గోదల బీరయ్య యాదవ్ ,మధ్గం నరసింహ యాదవ్ ,తాలూక యువజన కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ వహీద్ ,జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి గంగయ్య యాదవ్ ,తాలూక సోషల్ మీడియా కో ఆర్డినేటర్ రాజేష్ యాదవ్ ,వీపనగండ్ల కిసాన్ సెల్ అధ్యక్షుడు వెంకట్ రెడ్డి ,టౌన్ వైస్ ప్రెసిడెంట్ బాబా ,చిన్నంబావి,వీపనగండ్ల మండల మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సహిద బేగం , సుఖన్య ,మండలాల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు,యూత్ కాంగ్రెస్ మండల అద్యక్షులు,ఉపాధ్యక్షులు గ్రామ పార్టీ అధ్యక్షులు కాంగ్రెస్ నాయకులు మరియు యూత్ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS