ప్రకాశం జిల్లా దర్శి లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో “మా నమ్మకం నువ్వే జగన్ – జగనన్నే మా భవిష్యత్తు” కార్యక్రమం

Spread the love

ప్రకాశం జిల్లా దర్శి లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో “మా నమ్మకం నువ్వే జగన్ – జగనన్నే మా భవిష్యత్తు” కార్యక్రమం పై విలేకరుల సమావేశం లో ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ మాట్లాడుతూ

రాష్ట్రవ్యాప్తంగా 7 లక్షల మంది పార్టీ సైనికులైన గృహ సారథులు 7 వ తేదీ నుంచి 20 వ తేదీ వరకు ఒక యజ్ఞం లా మా నమ్మకం నువ్వే జగన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు

గత ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు 98% శాతం ముఖ్యమంత్రిగా వైయస్ జగన్ అమలు చేశారు.. ప్రజలలో నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు .

చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలంలో ఏ ఒక్క హామీని అమలు చేయకుండా నిత్యం మోసాలు చేస్తూ కాలం గడిపాడు .. అందుకే ప్రజలు “నిన్ను నమ్మం బాబు” అని తరిమేసారు అన్నారు

వైయస్ జగన్ మోహన్ రెడ్డి సంక్షేమ పాలనకు – చంద్రబాబు మోసాల పాలనకు గల తేడాను ప్రజలకు అర్థమయ్యేలా వివరించేందుకే ప్రతి గడపకు వెళ్తున్నాం .

ప్రజలకు మంచి చేశాం .. ఆ నమ్మకంతోనే మళ్ళీ సగర్వంగా ప్రజల ముందుకు వెళ్తున్నాం .. మంచి చేశామని ప్రజలు నమ్మితే మళ్ళీ ఆశీర్వదిస్తారు .

అనంతరం పొదిలి రోడ్డులోని ఏడవ వార్డులో ఎమ్మెల్యే మద్ది శెట్టి వేణుగోపాల్ గృహ సారధులు మున్సిపల్ కౌన్సిలర్లు కో ఆప్షన్ సభ్యులు మండల ఎంపీలు మరియు నాయకులు కలిసి ప్రతి ఇంటికి మా నమ్మకం నువ్వే జగన్ స్టిక్కర్లు ప్రతి గడపగడపకు తిరిగి సంక్షేమ పథకాలు అన్ని అందుతున్నాయా గత ప్రభుత్వంలో పోలిస్తే ఈ ప్రభుత్వం సేవలు ఇంతవరకు బాగున్నాయని అడిగి తెలుసుకుని ముందుకు సాగుతున్నారు
ఈ కార్యక్రమంలో గృహ సారధులు సచివాలయ కన్వీనర్లు వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page