ఇంటర్మీడియేట్ పరీక్షా కేంద్రాల వద్ద భద్రతా ఏర్పాట్లను స్వయంగా పరిశీలించిన ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీమతి మలిక గర్గ్ ఐపీఎస్

Spread the love

ప్రకాశం జిల్లా

ఇంటర్మీడియేట్ పరీక్షా కేంద్రాల వద్ద భద్రతా ఏర్పాట్లను స్వయంగా పరిశీలించిన ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీమతి మలిక గర్గ్ ఐపీఎస్

పరీక్షలకు బందోబస్తు విధులు నిర్వహిస్తున్న పోలీసు అధికారులు మరియు సిబ్బందికి పలు సూచనలు.

మాస్ కాపీయింగ్, మాల్ ప్రాక్టీస్ కు విద్యార్థులు పాల్పడినా వారికి ఎవరైనా సహకరించినా చట్ట ప్రకారం చర్యలు: జిల్లా ఎస్పీ

జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షలు జరుగుతున్న సందర్భముగా జిల్లా ఎస్పీ ఒంగోలులోని నాగార్జున డిగ్రీ కాలేజీ, కోర్ట్ సెంటర్ వద్ద నారాయణ జూనియర్ కాలేజీ మరియు శ్రీ చైతన్య జూనియర్ కాలేజీల పరీక్షా కేంద్రమును స్వయంగా తనిఖీ చేసి, అక్కడి భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. పరీక్షా కేంద్రాల వద్ద బందోబస్తు విధులు నిర్వహిస్తున్న పోలీసు అధికారులు మరియు సిబ్బందికి పలు సూచనలు తెలియచేసినారు.

పరీక్షా కేంద్రంలో మొబైల్ ఫోన్ లను అనుమతించరాదని, పరీక్షా కేంద్రాల దగ్గరలో జిరాక్స్ సెంటర్లు, ప్రింటింగ్ సెంటర్లు మూయించాలని, పరీక్షా కేంద్రాల పరిసరాల్లో బయట వ్యక్తులు, అనుమానాస్పద వ్యక్తులు తిరగకుండా చూడాలని, పరీక్షలు ప్రశాంత వాతావరణంలో ఎటువంటి విమర్శలకు తావులేకుండా సమర్ధవంతంగా నిర్వహించడానికి పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేసారు. అనంతరం పరీక్షా కేంద్రాల చీఫ్ సూపెరింటెండెంట్లు తో మాట్లాడి పలు సూచనలు తెలియచేసారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా అవసరమైన కనీస వసతులు సమకూర్చాలని సంబంధిత అధికారులకు సూచించారు.

జిల్లా ఎస్పీ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 72 ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని, పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ నిక్కచ్చిగా అమలు చేస్తున్నామని, పరీక్షా సమయంలో ఎటువంటి ట్రాఫిక్ అంతరాయం లేకుండా అన్ని చర్యలు తీసుకున్నామని, ప్రత్యేక మొబైల్ పెట్రోలింగ్ బృందాలను ఏర్పాటు చేసామని, పరీక్షలు జరుగు సమయంలో ఫ్లయింగ్ స్క్వాడ్లు నిరంతరం తిరుగుతూ ఉంటాయని, ప్రశ్నపత్రాల తరలింపు, సమాధాన పత్రాలు డిపాజిట్ చెయ్యడానికి తగిన ఎస్కార్ట్ ను ఏర్పాటు చేయడం జరిగిందిని, పరీక్షలు ప్రశాంతమైన వాతావరణంలో సజావుగా జరగడానికి పోలీస్ శాఖ తరఫునుండి అన్ని చర్యలు తీసుకున్నామని తెలియచేసినారు.

పరీక్షా కేంద్రాల పరిసర ప్రాంతాలలో అనుమానిత వ్యక్తులు ఉన్నట్లు తెలిస్తే వెంటనే అదుపులోకి తీసుకుంటామని, విద్యా శాఖ నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా వ్యవహరించినా, చిట్టీలు, పుస్తకాలు పెట్టి మాస్ కాపీయింగ్, మాల్ ప్రాక్టీస్ కు విద్యార్థులు పాల్పడినా వారికి ఎవరైనా సహకరించినా చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా ఎస్పీ హెచ్చరించారు.

జిల్లా వ్యాప్తంగా ఏ పరీక్షా కేంద్రం వద్దయినా ఎటువంటి చిన్న ఘటన జరిగిన వెంటనే DIAL 100/112 లేదా జిల్లా పోలీస్ వాట్సాప్ 9121102266 కు సమాచారం అందించాలని ఎస్పీ తెలియచేసారు.

ఎస్పీ వెంట ASP (అడ్మిన్) కె.నాగేశ్వరరావు, DSB DSP బి.మరియాదాసు, ఒంగోలు డిఎస్పీ యు.నాగరాజు, ఒంగోలు ట్రాఫిక్ డిఎస్పీ శ్రీనివాసరావు, ఒంగోలు వన్ టౌన్ సిఐ వెంకటేశ్వరరావు, తాలూకా సిఐ శ్రీనివాస రెడ్డి మరియు సిబ్బంది ఉన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page