ప్రజా సంగ్రామ యాత్రలో టీఆర్ఎస్ గుండాల దాడిని తీవ్రంగా ఖoడిస్తున్నాం

Spread the love

ప్రజా సంగ్రామ యాత్రలో టీఆర్ఎస్ గుండాల దాడిని తీవ్రంగా ఖoడిస్తున్నాం

బీజేపీ కార్యకర్తలపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలి..

ప్రోత్సహించిన జిల్లా మంత్రిని మరియు పోలీసులపై చర్యలు తీసుకోవాలి…

శేరిలింగంపల్లి నియోజకవర్గం బీజేపీ నాయకులు..

రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర పై జనగామ జిల్లా దేవరుప్పాలలో నిన్న కొంతమంది టీ ఆర్ ఎస్ గుండాలు చేసిన దాడికి నిరసనగా శేరిలింగంపల్లి నియోజకవర్గం బీజేపీ ఆధ్వర్యంలో చందానగర్ హైవే పై ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టి బొమ్మ ను దహనం చేసి నిరసన వ్యక్తం చేసిన శేరిలింగంపల్లి నియోజకవర్గం బీజేపీ నాయకులు.

ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర నాయకులు మొవ్వ సత్యనారాయణ, జిల్లా ప్రధాన కార్యదర్శి చింతకింది గోవర్ధన్ గౌడ్ లు మాట్లాడుతూ కే సీ ఆర్ నిరంకుశ పాలనకు చరమగీతం పాడేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని,ప్రజాసామ్యoలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్యం ప్రజసౌమ్యాన్ని పరిరక్షించాలి గాని ప్రభుత్యమే ప్రజల పై గుండాగిరి చేయటం ప్రతిపక్ష నాయకులపై,కార్యకర్తలపై దాడి చేయటం ముర్కత్యం అని, ఇంకొక్కసారి ఇలా జరిగితే ప్రభుత్యం పై ప్రజలే తిరుగుబాటు చేస్తారని, రాబోయే కాలంలో ప్రజలే ప్రభుత్యానికి బుద్ధి చెబుతారని హెచ్చరించడం జరిగినది.

ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు బుచ్చి రెడ్డి,జితేందర్, అనిల్ గౌడ్, చందానగర్ మాజీ కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి, మహిపాల్ రెడ్డి,త్రినాధ్, నూనె సురేందర్, డివిజన్ అద్యక్షులు రాంరెడ్డి, షైఫుల్లహ ఖాన్, ఆంజనేయులు, నవీన్ గౌడ్,చంద్రమోహన్, కమలాకర్ రెడ్డి, రాకేష్
దుబే,మహేష్ ముదిరాజ్,వంశీ,ఆకుల లక్ష్మణ్,ఆకుల అశోక్,జగదీష్,హరి కృష్ణ,కళ్యాణ్, మహిళా నాయకురాల్లు కాంచన కృష్ణ, మేరి, విజయలక్ష్మి,కృష్ణవేణి,లక్ష్మీ,
లలిత,నిషత్,శ్రీను.పి,చందర్ రావు,ఎం.డి.గౌస్,BJYM నాయకులు మరియు నియోజకవర్గ,డివిజన్ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు

Related Posts

You cannot copy content of this page