పొంగులేటికి పదవిపై మైనార్టీల హర్షంక్యాంపు కార్యాలయంలో ఘన సన్మానం

Spread the love

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:

తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ కో ఛైర్మన్ గా నియమితులై ఇటీవలె బాధ్యతలు స్వీకరించిన ఖమ్మం మాజీ పార్లమెంటు సభ్యులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి ని జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు మియాభాయ్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. పొంగులేటికి పదవి రావటం హర్షనీయం అని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. ఖమ్మం లోని పొంగులేటి క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో నగరంలోని పలు డివిజన్లకు చెందిన మైనారిటీ నాయకులు యాకుబ్ భాయ్, నసీముద్దిన్, ఇసూబ్ ఖురేషి, గఫూర్, హైదర్ అలీ, మహ్మద్ అలీ, సర్వర్, సాద్, ఇర్ఫాన్, అప్జలుద్దీన్, అజీజ్, అంజద్ తదితరులున్నారు.

Related Posts

You cannot copy content of this page