సాక్షిత : డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల విషయంలో BJP నాయకులు రాజకీయ డ్రామాలు చేస్తున్నారని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మండిపడ్డారు. ఆదర్శ నగర్ లోని MLA క్వార్టర్స్ లో గల తన కార్యాలయంలో మీడియా తో మాట్లాడారు. దేశంలో పేద ప్రజలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మించి ఉచితంగా ఇచ్చిన ఏకైక రాష్ట్రం తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం అని వివరించారు. స్వయం పాలనలో పేద ప్రజలు ఆత్మగౌరవంతో జీవించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అన్ని మౌలిక సౌకర్యాలు, వసతులతో కూడిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 2.65 లక్షల ఇండ్లను, GHMC పరిధిలో లక్ష ఇండ్లను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకోవడం జరిగిందని పేర్కొన్నారు. గతంలో పేదలకు నిర్మించిన ఇండ్ల కార్యక్రమంలో లబ్దిదారుడి వాటా, బ్యాంక్ రుణం, కొంత ప్రభుత్వ సహాయం ఉండేదని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం లబ్దిదారుడిపై ఒక్క పైసా భారం లేకుండా ఉచితంగా నిర్మించి ఇస్తుందని వివరించారు. సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని IDH కాలనీలోనే మొట్టమొదటగా డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మించడం జరిగిందని చెప్పారు. ఇప్పటికే నగరంలోని సనత్ నగర్, కార్వాన్, ముషీరాబాద్, జూబ్లీహిల్స్, ఖైరతాబాద్ తదితర నియోజకవర్గాలలో ఇండ్లను నిర్మించి ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. కొల్లూరు లో 6,700 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కాలనీని ఇటీవలనే ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రారంభించినట్లు తెలిపారు. ఆ ఇండ్లను కూడా అర్హులైన లబ్దిదారులకు అందజేయనున్నట్లు మున్సిపల్ శాఖ మంత్రి ప్రకటించారని చెప్పారు. కేంద్రమంత్రిగా, రాష్ట్ర BJP అద్యక్షుడిగా బాద్యతాయుతమైన పదవులలో ఉన్న కిషన్ రెడ్డి కి అధికారికంగా డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను సందర్శించి పరిశీలించే అవకాశం ఉన్నప్పటికీ అలా కాదని రోడ్డుపై బైఠాయించాల్సిన అవసరం ఏముందని, ఏం ఆశించి ఎందుకోసం ఈ రాద్దాంతం చేస్తున్నారో చెప్పాలని మంత్రి శ్రీనివాస్ యాదవ్ ప్రశ్నించారు. ఇండ్లను లబ్దిదారులకు పంపిణీ చేస్తామని ప్రకటించిన తర్వాత కూడా ఈ ఆందోళన ఎందుకు చేస్తున్నారో చెప్పాలని అన్నారు. పేద ప్రజల సంక్షేమం కోసం మీరు ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. నిజంగా పేదలకు మేలు చేయాలనే ఆలోచన మీకు ఉంటే కేంద్ర ప్రభుత్వం నుండి ఎందుకు నిధులు తేలేకపోతున్నారని ప్రశ్నించారు. పేదల అభివృద్ధి, సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని అన్నారు. సొంత స్థలం ఉంది ఇల్లు నిర్మించుకోలేకపోతున్న పేదలకు అర్హులైన ఒకొక్కరికి 3 లక్షల రూపాయలు చొప్పున ఆర్ధిక సహాయం అందించే విధంగా గృహలక్ష్మి అనే నూతన కార్యక్రమాన్ని త్వరలోనే ప్రారంభించున్నట్లు వివరించారు. ఒక్కో నియోజకవర్గ పరిధిలో 3 వేల మంది అర్హులకు ఈ ఆర్ధిక సహాయం అందించడం జరుగుతుందని చెప్పారు. కేవలం రాష్ట్ర ప్రభుత్వం పై బురద చల్లే ప్రయత్నంలో భాగంగానే రోడ్డుపై అర్ధం లేని ఆందోళన చేపట్టారని విమర్శించారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల ప్రారంభ కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పాల్గొని ప్రశంసించిన విషయం వాస్తవం కాదా ? అన్నారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారని, ఇక నైనా తమ వైఖరిని మార్చుకోవాలని హితవు పలికారు
Related Posts
Spread the love హైదరాబాద్: శంషాబాద్ విమానాశ్రయం సమీపంలో పోలీసులు భారీగా బంగారం, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. మధ్యాహ్నం వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా ఓ కారులో 34 కిలోల బంగారం, 40కిలోల వెండి ఆభరణాలు పట్టుబడ్డాయి. సరైన పత్రాలు లేకపోవడంతో…
Spread the love భువనగిరి ఎంపీ అభ్యర్థి చామలా కిరణ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు పెద్దాపహాడ్ గ్రామానికి చెందిన నామాల రవి తాటిచెట్టు మిది నుండి కింద పడి వెన్నుపూస విరగడం వలన మంచానికి పరిమితమైన నామాల రవి కుటుంబానికి…
సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో కాంగ్రెస్ జెండా ఎగారాలి, బై ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మెజారిటీ ఓట్లతో గెలవాలి
Spread the love సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో కాంగ్రెస్ జెండా ఎగారాలి, బై ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మెజారిటీ ఓట్లతో గెలవాలి- ఎనుముల కృష్ణారెడ్డి & రఘునాథ్ యాదవ్ సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ సీనియర్ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం…
Spread the love మైనార్టీల సంక్షేమ కోసం పనిచేసే బిఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి కి మద్దతునివ్వండి : ఎమ్మెల్యే కేపీ.వివేకానంద …. 129 – సూరారం డివిజన్ కళావతి నగర్ మహమ్మదీయ మజీద్ గల్లీలో బిఆర్ఎస్ ఎంపీ…
Spread the love తెలుగు రాష్ట్రాల్లో మే 13న అంటే పోలింగ్ నాటికి ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంది. దీనికోసం EC.. ఓటర్లకు కొన్ని సూచనలు జారీచేశారు. ఉదయం పోలింగ్ ప్రారంభంకాగానే ఓటు హక్కు వినియోగించుకోండి. ఉదయం ఓటేయడం…
Spread the love బుల్కాపూర్, చిన్న శంకర్పల్లి వార్డులలో ఎన్నికల ప్రచారం: నియోజకవర్గ అసెంబ్లీ ఇన్చార్జి భీమ్ భరత్ సాక్షిత శంకర్పల్లి:దేశంలో, రాష్ట్రంలో ఎవరెన్ని కుట్రలు పన్నినా కాంగ్రెస్ పార్టీ గెలుపును ఎవరూ ఆపలేరని చేవెళ్ల నియోజకవర్గం అసెంబ్లీ ఇన్చార్జ్ బీమ్…
Spread the love కొండాపూర్ మండల పరిధి మన్ సాన్ పల్లి, మునిదేవునిపల్లి, గొల్లపల్లి, గుంతపల్లి, గడి మల్కాపూర్ గ్రామాల్లో ఎన్నికల ప్రచారం: కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దండు శ్రీనివాస్ గుప్త కొండాపూర్: ప్రజలంతా కాంగ్రెస్ కు అండగా నిలవాలని, తమ…
Spread the love మల్కాజ్ గిరి పార్లమెంటు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని శ్రీమతి పట్నం సునీత మహేందర్ రెడ్డి తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి .ఈ ప్రచారంలో పార్లమెంటు ఇంఛార్జ్ మైనంపల్లి…
Spread the love చేవెళ్ల పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి ని వచ్చే పార్లమెంట్ ఎన్నికలలో ఆల్విన్ కాలనీ డివిజన్ తరపున అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలిపించుకోవడానికి శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జగదీశ్వర్ గౌడ్…
Spread the love పరోక్షంగా వద్దు.. ప్రత్యక్షంగా విచారించండి: కవితఢిల్లీ లిక్కర్ స్కాం విచారణలో భాగంగా కీలక విషయాలను రౌస్ అవెన్యూ కోర్టులో ఎమ్మెల్సీ కవిత దరఖాస్తు చేశారు. తనను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టులో హాజరుపర్చవద్దని.. కేసు విచారణ వేళ…