బాల్ రెడ్డి కుటుంబానికి ఆర్ధికసాయం చేసిన అంతటి పారిజాత నర్సింహ

Spread the love

చిట్యాల సాక్షిత ప్రతినిధి

చిట్యాల మండలం వెలిమినేడు గ్రామంలో గల 4వ వార్డుకు చెందిన ఏనుగు బాల్ రెడ్డి గత కొద్దిరోజుల క్రితం మరణించారు. మంగళవారం రోజు వారి దశదిన కర్మ సందర్భంగా అంతటి పారిజాత నర్సింహ వారి కుటుంబ సభ్యులని ఓదార్చి బాల్ రెడ్డి
చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపి కుటుంబానికి 5వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందచేశారు. ఈ కార్యక్రమంలో గ్రామశాఖ అధ్యక్షుడు కాటం సత్తయ్య, సర్పంచ్ దేశబోయిన మల్లమ్మ, సింగల్ విండో డైరెక్టర్ ఏనుగు రఘుమారెడ్డి, ఆంజనేయ స్వామి దేవాలయం మాజీ చైర్మన్ గోలి గణేష్,వార్డు సభ్యులు ఏనుగు.పద్మారెడ్డి, అంతటి శోభ రాజు,పాలసంగం డైరెక్టర్ లు కర్ధురి మల్లారెడ్డి మారగొని యాదయ్య, ఏనుగు సుధాకర్ రెడ్డి,కూరకుల సురేష్, గోలి మహేష్, వీరమల్ల మల్లేష్, అంశల శ్రవణ్,అరూరి పాండు, చెరుకు నరేష్, కంచుకొమ్ముల శివ తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page