తాండ్ర వినోద్ రావు గారికి పద్మశ్రీ వనజీవి రామయ్య ఆశీస్సులు.

Spread the love

ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి తాండ్ర వినోద్ రావు కి
నిర్విరామ హరిత దీక్షా పరుడు పద్మశ్రీ దరిపెల్లి రామయ్య శుభాశీస్సులు అందజేసారు.
ఖమ్మంలోని వినోద్ రావు క్యాంపు కార్యాలయాన్ని వనజీవి సందర్శించారు.
అనంతరం వారిద్దరూ కలిసి కార్యాలయ ప్రాంగణంలో ఒక మొక్క నాటారు. ఈ సందర్భంగా తాండ్ర వినోద్ రావు మాట్లాడుతూ-కోటికి పైగా మొక్కలను నాటి వాటిని బిడ్డలవలే పెంచుతూ, వృక్షాలను రక్షిస్తే.. అవి మనల్ని రక్షస్తాయని అవిరళ ప్రచారం చేసి అందరికీ ఆదర్శంగా నిలిచిన వనజీవి దరిపెల్లి రామయ్య జీవితం అందరికీ ఆదర్శప్రాయం అన్నారు. 84 ఏళ్ల వయసులో కూడా తాను నమ్మిన సిద్ధాంతానికి పచ్చని బాట వేస్తున్న రామయ్య కృషిని ఆదర్శంగా తీసుకోవాల్సిన అవశ్యకత ఉందన్నారు.

Related Posts

You cannot copy content of this page