కార్పొరేటర్ సాయి నగర్ ఈస్ట్ లో పాదయాత్ర

Spread the love

124 డివిజన్ పరిధిలోని ఈస్ట్ సాయి నగర్ లోని రోడ్డు మరియు డ్రైనేజీ సమస్యలను కాలనీ వాసులు డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ దృష్టికి తీసుకురాగా కార్పొరేటర్ సాయి నగర్ ఈస్ట్ లో పాదయాత్ర చేసి సమస్యలను స్వయంగా పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ సాయి నగర్ ఈస్ట్ కాలనీలోని రోడ్డు నెంబర్ 2, 4 మరియు మెయిన్ రోడ్డులో డ్రైనేజీ శాంక్షన్ అయ్యి ఉంది కాబట్టి త్వరలోనే నిర్మాణ పనులు మొదలుపెడతారని అన్నారు.

అనంతరం సీసీ రోడ్లు కూడా నిర్మించి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు సమ్మారెడ్డి, జైహింద్, శేఖర్ రెడ్డి, నిఖిల్ రెడ్డి, భారత్ కుమార్, దినేష్, బాలీశ్వర్, రామచంద్ర రెడ్డి, రాజా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page