కాలనీ కాంటాక్ట్ కార్యక్రమంలో సంబంధిత అధికారులతో కలిసి పాదయాత్ర

Spread the love

హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని బృందావన్ కాలనీ, వర్టెక్స్ ప్రెస్టేజ్, జై భారత్ నగర్ లలో జరిగిన కాలనీ కాంటాక్ట్ కార్యక్రమంలో సంబంధిత అధికారులతో కలిసి పాదయాత్ర నిర్వహించి కాలనీల లోని పలు సమస్యలను తెలుసుకున్న కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు .

ఈ సందర్భంగా కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు మాట్లాడుతూ హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని ప్రతి కాలనీ, బస్తీ, రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ లలో గల పలు సమస్యలు పరిష్కారమే ధ్యేయంగా జిహెచ్ఎంసి మరియు వివిధ ప్రభుత్వ అధికారులతో కలిసి ప్రత్యేక్షంగా వెళ్లి సమస్యలు తెలుసుకోవాలనే ముఖ్య ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమం ను చేపట్టడం జరిగినది అని, కాలనీ లలో పేరుకుపోయిన సమస్యలు పరిష్కరించడానికి చక్కటి వేదిక అని, సుమారు 15 డిపార్ట్మెంట్ అధికారులు ఒకే వేదిక ను పంచుకోవడం జరుగుతుంది అని, మీ కాలనీ సమస్యలను నేరుగా చెప్పుకోవడానికి ఇది ఒక చక్కటి కార్యక్రమం అని, ప్రతి కాలనీ వారు సద్వినియోగం చేసుకొని సమస్యలు పరిష్కరించుకోవాలని కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు పేర్కొన్నారు, కాలనీ అసోసియేషన్ సభ్యులు, కాలనీ వాసులు, కాలనీ ప్రతినిధులు,రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు, నాయకులు, ప్రజాప్రతినిధులు, సంఘ సేవకులు ప్రతి ఒక్కరు చక్కగా సద్వినియోగం చేసుకొని మన కాలనీ లను, మన ప్రాంతాలను ప్రశాంత వాతావరణంలో అభివృద్ధి చేసుకోవాలని కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు తెలియచేశారు,

ఈ కార్యక్రమంలో అధికారులు అసిస్టెంట్ మున్సిపల్ కమీషనర్ మహేందర్ రెడ్డి, ఏఈ లు రాజీవ్, ప్రశాంతి,వర్క్ ఇన్స్పెక్టర్ మహాదేవ్, కమ్యూనిటీ ఆర్గనైజర్ ముస్తఫ్ఫా, స్ట్రీట్ లైట్స్ సూపర్వైజర్ సుధాకర్, లైన్ మెన్ కాళీ, హరికల్చర్ దాసు, ఎస్ఎఫ్ఏ లు భరత్ డివిజన్ అధ్యక్షుడు దామోదర్ రెడ్డి, ఉపాధ్యక్షుడు పోతుల రాజేందర్, రాగ ప్రసాద్, కాలనీ వాసులు రవి, బోస్, రఘు, కోనేరు హరి, కిరణ్, హరి, నరేష్, శ్రీనివాస్, కేశవ, నాగేశ్వరరావు, బద్రి, సురేష్, శివ రాం ప్రసాద్, కుమార స్వామి, ప్రభాకర్, మహేష్, పూర్ణ చందర్ రావు, సాంబశివరావు, శివ రామ కృష్ణ, పద్మనాభ రెడ్డి, నర్సయ్య, సీతాపతి తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page