విద్యార్థినిపై పి.ఈ.టి ఉపాధ్యాయురాలి దాష్టికం

Spread the love

P.E.T teacher’s envy of the student

విద్యార్థినిపై పి.ఈ.టి ఉపాధ్యాయురాలి దాష్టికం

చున్నీ వేసుకోలేదని విద్యార్థినీ పై పి.ఈ.టి ప్రతాపం

విద్యార్థినీ చెంపపై వేడి ఇనుపకడ్డీతో వాత పెట్టిన వైనం

అధికారుల పర్యవేక్షణ లోపం

పి.ఈ.టి పావనిని విధుల నుంచి తొలగించాలని ఎపి పేరెంట్స్ కమిటీ నంద్యాల జిల్లా అధ్యక్షులు జవహర్ నాయక్ డిమాండ్

నంద్యాల జిల్లా,కొత్తపల్లి మండలం కస్తూరిబా బాలికల ఆశ్రమం పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థిని కీర్తి చెంపపై పి.ఈ.టి ఉపాధ్యాయురాలు పావని వేడి కడ్డీతో వాత పెట్టడం జరిగింది.

వివరాల్లోకి వెళితే పాములపాడు మండలం కొత్త బానకచర్ల గ్రామానికి చెందిన కీర్తి కొత్తపల్లి కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాలలో పదో తరగతి చదువుతుంది.కీర్తి చున్ని వేసుకోలేదని,ఇతర విద్యార్థినీల ముందు తిడుతుందనీ కోపంతో పి.ఈ.టి పావని ఏకంగా శనివారం నాడు ఇనుపకడ్డీ వేడిచేసి చెంపపై వాత పెట్టడం జరిగింది.

కీర్తి తల్లిదండ్రులు వచ్చి పీ.ఈ.టి పావనిని మందలించి,కీర్తిని ఇంటికి పిలుచుకొని పోవడం జరిగింది.ఆ పి.ఈ.టి ఉపాధ్యాయురాలిని విధుల నుంచి తొలగించాలని ఎపి పేరెంట్స్ కమిటీ నంద్యాల జిల్లా అధ్యక్షులు జవహర్ నాయక్ డిమాండ్ .

Related Posts

You cannot copy content of this page