SAKSHITHA NEWS

సాక్షిత నెల్లూరు జిల్లా: సర్వేపల్లి నియోజకవర్గం, ముత్తుకూరు మండలం, బ్రహ్మదేవం గ్రామ సచివాలయం-1 పరిధిలో “గడప గడపకు మన ప్రభుత్వం” కార్యక్రమంలో భాగంగా గురవయ్యశాల, రంగాచార్యుల కండ్రిగ, కోమటిగుంట, గోవిందరెడ్డిపాళెం గ్రామాలలో పర్యటించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ మరియు సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖా_మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి .

ప్రజల వద్దకు వెళ్లి, ప్రజల సమస్యలు తెలుసుకొని, వాటిని పరిష్కరించేందుకే గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం.


గ్రామాల అభివృద్ధి, గ్రామ ప్రజల సంక్షేమమే ధ్యేయంగా గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం.
గ్రామాలలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పట్ల, జగన్మోహన్ రెడ్డి పాలన పట్ల ప్రజల నుండి మంచి స్పందన వస్తుంది.
బ్రహ్మదేవం పంచాయతీలోని ప్రజలకు నాన్ ఫిషర్ మెన్ ప్యాకేజీ కింద 3 కోట్ల 75 లక్షల రూపాయలు అందజేశాం.
చంద్రబాబుది మాటల ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ది చేతల ప్రభుత్వం.
చంద్రబాబు గతంలో అనేక హామీలిచ్చి మోసం చేస్తే, జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చారు.
జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ప్రజలు నూటికి నూరు శాతం సంతోషంగా ఉన్నారు.
రైతులు పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర రాకూడదు, ప్రభుత్వంపై బురద చల్లాలని తెలుగుదేశం నాయకులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.


రైతుల ధాన్యానికి మార్కెట్ లో గిట్టుబాటు ధర కంటే ఎక్కువ రేటు పలకడంతో తెలుగుదేశం నాయకులు “ఇదేం! ఖర్మ రా బాబు” అని కుమిలి కుమిలి ఏడుస్తున్నారు.
గతంలో గ్రామాలలో మట్టి రోడ్లు కనిపిస్తుందేవి, నేడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మట్టి రోడ్డు అనేది కనిపించకుండా అవసరమైన ప్రతిచోట సిమెంట్ రోడ్లు వేయించాం.
బ్రహ్మదేవం గ్రామంలో కోట్ల రూపాయలు వెచ్చించి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించాం.
ప్రజలు, పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు అందిస్తున్న జగన్మోహన్ రెడ్డి ని వదులుకొని, మోసం చేసే చంద్రబాబుని కోరుకోరు..


SAKSHITHA NEWS