SAKSHITHA NEWS

గండేపల్లి గ్రామంలో “గడపగడపకు -మన ప్రభుత్వం” కార్యక్రమం నిర్వహించిన MLA డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు ..

జగనన్న మరోసారి ముఖ్యమంత్రి కావటం.. రాష్ట్రానికి చారిత్రక అవసరం : MLA డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు ..

పేదలు గెలిచే వరకు.. వారి జీవితాలు బాగుపడే వరకు.. జగనన్న పెత్తందారులపై యుద్ధం చేస్తూనే ఉంటారు : MLA డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు ..

కంచికచర్ల మండలంలోని “గండేపల్లి” గ్రామంలో గడపగడపకు -మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఉదయం ప్రతి గడపకు వెళ్లి ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాల బుక్ లెట్ లను శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు ప్రజలకు అందజేశారు ..

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో పేదవాళ్లకు – పెత్తందారులకు మధ్య యుద్ధం జరుగుతుందని.. పేదవాడి పక్షాన ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి నిలబడితే – పెత్తందారుల మేలు కోసం చంద్రబాబు నాయుడు కుట్రలు పన్నుతున్నాడని చెప్పారు. ఆర్థికంగా, సామాజికంగా, నైతికంగా వెనుకబడిపోయిన బడుగు, బలహీన, దళిత, వెనుకబడిన వర్గాలను చేయి పట్టుకొని నడిపించి.. వారిని అక్కున చేర్చుకొని రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా జగనన్న ప్రభుత్వం వెన్నుదన్నుగా నిలిచి.. వారిని రాజ్యాధికారంలో భాగం చేస్తున్నారని తెలిపారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్, జ్యోతిరావు పూలే బాబు, జగజ్జీవన్ రామ్ ల ఆశయాలను కొనసాగిస్తున్న ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఈ రాష్ట్రానికి మరోసారి ముఖ్యమంత్రిగా అవటం చారిత్రక అవసరమని, జగనన్న మరోసారి ముఖ్యమంత్రిగా చేసుకునేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు మద్దతు అందించాలని ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు ప్రజలను కోరారు. శ్రీమంతుల కుటుంబాలకే పరిమితమైన ఫ్యామిలీ డాక్టర్ విధానం, ఇంగ్లీష్ మీడియం విద్యను పేదవారికి సైతం అందేలా చేసిన ఘనత ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి కే దక్కిందన్నారు ..

ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, తదితరులు పాల్గొన్నారు ..

Whatsapp Image 2024 01 19 At 9.58.59 Am

SAKSHITHA NEWS