గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం

Spread the love

గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం, ప్రజల సమస్యల పరిస్కారానికి చక్కని వేదికగా నిలుస్తోందని, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి సంతోషాన్ని వ్యక్తం చేశారు.

తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలోని 11, 27 డివిజన్లలో కార్పొరేటర్లు, దొద్దారెడ్డి ప్రవళిక రెడ్డి, మేయర్ డాక్టర్ శిరీష ఆధ్వర్యంలో పెద్దకాపులేఔట్, జయశ్యాం రోడ్డులో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం గురువారం జరిగింది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, ఉప మేయర్ ముద్ర నారాయణ హాజరై,ఇంటింటికి వెళ్లి ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాలను గురించి అడిగి తెలుసుకున్నారు.

తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలో తనకు అనుకూలంగా పోస్టులు పెట్టుకుని,శునకానందం పొందుతోందని తెలిపారు.

జగన్ కు ప్రజల నుంచి వస్తున్న స్పందన చూసి టీడీపీ ఓర్వలేక,సోషల్ మీడియా ద్వారా ఆత్మానందం పొందుతోందని ఎద్దేవా చేశారు.

Related Posts

You cannot copy content of this page