నిరాటంకంగా గడప గడపకు మన ప్రభుత్వం

Spread the love

రెడ్డిగూడెం మండలంలోని నాగులూరు గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం నిరాటంకంగా కొనసాగుతోంది. మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాద్ సాయంత్రం ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రతి ఇంటికి వెళ్లి రాష్ట్ర ప్రభుత్వం నుంచి వారి కుటుంబాలకు జరిగిన సంక్షేమలబ్ధి గురించి తెలియజేశారు. ప్రజా సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి ఆదేశాలు జారీ చేశారు. స్థానిక ప్రజా ప్రతినిధులు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page