జనరంజకంగా గడప గడపకు మన ప్రభుత్వం.

Spread the love

ప్రతిగడపలో అద్వితీయ ఘనస్వాగతం.

శాసనసభ్యులు కృష్ణప్రసాదు కి జననీరాజనం.

ఎన్టీఆర్ జిల్లా,

మైలవరం పట్టణంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం జనరంజకంగా కొనసాగుతోంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు కి పట్టణ ప్రజలు అద్వితీయ ఘనస్వాగతం పలికారు. ప్రతి గడపలో జనాలు ఆయనకు నీరాజనాలు పలికారు. అభిమాన నేతను అక్కున చేర్చుకుంటున్నారు.

ఈ సందర్భంగా శాసనసభ్యులు కృష్ణప్రసాదు మాట్లాడుతూ సమాజాన్ని పట్టి పీడిస్తున్న పేదరికం అనే జాఢ్యాన్ని సమూలంగా నివారించేందుకు సీఎం జగనన్న నాలుగేళ్ల పాలనలో ఎన్నో సంస్కరణలు ప్రవేశ పెట్టారని అన్నారు. వాటి అమలుకు ప్రత్యేకంగా దృష్టిపెట్టి పేదల పక్షపాతిగా పేరు తెచ్చుకున్నారని అన్నారు.

ఏపీలో అమలు చేస్తున్న ఎన్నో సంక్షేమ పథకాలు పేదలు తలెత్తుకు తిరిగే విధంగా తీర్చిదిద్దాయన్నారు. మైలవరం నియోజకవర్గంలో గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి పనులు చేసినట్లు పేర్కొన్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి గ్రామాల్లో,పట్టణాల్లో ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుంది అని ఎక్కడికి వెళ్ళిన కూడా ప్రజలు సతోషం వ్యక్తం చేస్తున్నారన్నారు.

ఇంక కొంత మందికి ఎక్కడైనా సాంకేతిక కారణాల వల్ల రాలేని వారికి వాటిని పరిష్కరిస్తామన్నారు. పాదయాత్రలో ఇచ్చిన హామీల్లోఇప్పటికే 99 శాతం మేర నెరవేర్చిన ఘనత మన ముఖ్య మంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారికి దక్కుతుందన్నారు.

నిత్యం ప్రజల కోసం కష్టపడే నాయకుడు మన ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి అలాంటి నాయకున్ని మళ్ళీ మనం ముఖ్య మంత్రిగా చేసుకుంటేనే మనమందరం సంతోషంగా పార్టీలకు, కులాలకు, మతాలకు అతీతంగా అర్హులైన ప్రతి పేదవానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు లబ్ధి పొందడం జరుగుతుందని, కాబట్టి రాబోయే ఎన్నికలలో వైయస్సార్ పార్టీని అఖండ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.

Related Posts

You cannot copy content of this page